News September 12, 2025
మంచిర్యాల: ఐటీఐలలో వాక్ ఇన్ అడ్మిషన్లు

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు వాక్ ఇన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ వై.రమేష్ తెలిపారు. నాలుగవ దశ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు నేరుగా హాజరు కావచ్చునని ఆయన చెప్పారు. గతంలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఉదయం 9 గంటలకు కళాశాలకు రావాలని ఆయన సూచించారు.
Similar News
News September 12, 2025
‘TG 09 G9999’కు రూ.25.50 లక్షలు

TG: సెంటిమెంట్ కోసం కొందరు వాహనం కంటే రిజిస్ట్రేషన్ నంబర్కు అధికంగా వెచ్చిస్తుంటారు. HYD సెంట్రల్ జోన్ RTA ఇవాళ నిర్వహించిన వేలంలో TG09G9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ.25.50 లక్షలు పలికింది. పలు కార్పొరేట్ కంపెనీలు, సోలో బయ్యర్స్ పాల్గొనగా Hetero డ్రగ్స్ లిమిటెడ్ భారీ ధరకు ఈ నంబర్ను దక్కించుకుంది. ఇతర నంబర్లు రూ.1.01-6.25 లక్షల వరకు సేల్ అయ్యాయి. మొత్తంగా ఒక్క రోజే రూ.63.7 లక్షల ఆదాయం వచ్చింది.
News September 12, 2025
అనకాపల్లి, విజయనగరంలో VMRDA జోనల్ కార్యాలయాలు ప్రారంభం

పరిపాలన సౌలభ్యం కోసం అనకాపల్లి, విజయనగరంలో నిర్మించిన VMRDA జోనల్ కార్యాలయాలను ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, IAS వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విజయనగరంలో రూ.47.95 లక్షలు, అనకాపల్లిలో రూ.33.5 లక్షలతో పునఃనిర్మాణం చేసిన కార్యాలయాలు ప్రజలకు చేరువ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతులు మురళీకృష్ణ, వినయ్ కుమార్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News September 12, 2025
విజయవాడలో కరాటే జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 కరాటే జట్ల ఎంపికలు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో శుక్రవారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని జిల్లా ఎస్జిఎఫ్. కార్యదర్శులు అరుణ, రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని కరాటే గురువులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.