News September 12, 2025

రేపు విశాఖ రానున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా

image

కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం విశాఖ రానున్నారు. శనివారం రాత్రి 8:50కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రికి నోవాటల్లో బస చేస్తారు. ఆదివారం ఉదయం రైల్వే గ్రౌండ్‌లో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం పలువురు స్థానిక నేతలతో సమావేశం అవుతారు. ఆదివారం సాయంత్రం 4:45కి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.

Similar News

News September 12, 2025

విశాఖ: ‘మందుల విక్రయాలు జాగ్రత్తగా నిర్వహించాలి’

image

విశాఖలోని VMRDA చిల్డ్రన్స్ ఏరినాలో డ్రగ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో మందుల దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోలర్ విజయకుమార్ హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వర్ణలత పాల్గొని డ్రగ్స్ పై వివరించారు.

News September 12, 2025

విశాఖ: నెల రోజుల పాటు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

image

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో గోడ పత్రిక ఆవిష్కరించారు. జిల్లాలో 58 వేల పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తామన్నారు. రైతులు పశువులన్నింటికీ టీకాలు వేయించుకోవాలని కోరారు.

News September 12, 2025

అనకాపల్లి, విజయనగరంలో VMRDA జోనల్ కార్యాలయాలు ప్రారంభం

image

పరిపాలన సౌలభ్యం కోసం అనకాపల్లి, విజయనగరంలో నిర్మించిన VMRDA జోనల్ కార్యాలయాలను ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, IAS వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విజయనగరంలో రూ.47.95 లక్షలు, అనకాపల్లిలో రూ.33.5 లక్షలతో పునఃనిర్మాణం చేసిన కార్యాలయాలు ప్రజలకు చేరువ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతులు మురళీకృష్ణ, వినయ్ కుమార్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.