News September 12, 2025
HYD: ఈ మెట్రో రైలు మాకొద్దు బాబోయ్: L&T

HYDలో లక్షలాది మంది ప్రయాణికులను చేరవేస్తున్న మెట్రో రైల్ నిర్వహణ తమకు చేతకావడం లేదని.. ఖర్చులు పెరిగిపోతున్నాయని L&T కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దాదాపు రూ.5వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని.. రోజూ వచ్చే టికెట్ ఆదాయం సరిపోవడం లేదని.. ఇలా అయితే ఉద్యోగుల జీతాలు ఇచ్చుకోలేమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
Similar News
News March 14, 2026
రాజమండ్రి: ఆగని మరణాలు.. మరో ఇద్దరు మృతి

రాజమండ్రిలో గత నెలలో చోటు చేసుకున్న కల్తీ పాల ఘటనలో శుక్రవారం మరో ఇద్దరు మృతి చెందారు. కిమ్స్ బుల్లినేని ఆసుపత్రిలో కడలి కృష్ణారావు (75), డెల్టా ఆసుపత్రిలో రెడ్డి అనంతలక్ష్మి (55) మరణించారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. ఇంకా ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
News March 14, 2026
బుకింగ్ తర్వాత గ్యాస్ రావడం లేదా? అయితే ఇలా చేయండి!

గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లో డెలివరీ కాకుంటే టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని డీఎస్ఓ ప్రకాశ్ రావు శనివారం తెలిపారు. ఇండేన్ వినియోగదారులు 1800-2333-555, 7718955555 నంబర్లకు, భారత్ గ్యాస్ కస్టమర్లు 1800-22-4344, 7715012345కు ఫోన్ చేయాలన్నారు. HP గ్యాస్ వారు 1800-2333-555, 9493602222 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News March 14, 2026
చెరకు రసంతో కాంతివంతమైన చర్మం

చర్మకాంతిని పెంచడంలో చెరకురసం ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. * చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్లా చేసుకుని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. * చెరకు రసంలో కొద్దిగా తేనె కలిపి, ముఖానికి మసాజ్ చేసి, 10నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.


