News September 12, 2025
నిర్మల్ : బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు తెలిపారు. ఇందులో భాగంగా 17న మండల, పట్టణ కేంద్రాల్లో రక్తదానం, 18న స్వచ్ఛభారత్, 25న ప్రవాస్ బూత్ స్థాయిలో మొక్కలు నాటడం, 27న దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ, సన్మానం ఉంటుందన్నారు. పార్టీ శ్రేణులు, పదాధికారులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.
Similar News
News September 12, 2025
గోదావరిఖని నుంచి గోవా.. రయ్.. రయ్..!

గోదావరిఖని బస్టాండ్ నుంచి ఈనెల 23వ తేదీ ఉ.10 గంటలకు రాజధాని ఏసీ బస్ మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం అనంతరం గోవా చేరుకుని తిరిగి 28వ తేదీన గోదావరిఖని చేరుకుంటుందని GDK RTC DM నాగభూషణం తెలిపారు. టికెట్ ధర రూ.8,000 ఉంటుందని, పూర్తి వివరాలతోపాటు టికెట్ల రిజర్వేషన్ కోసం 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని కోరారు.
News September 12, 2025
HYD: మిలాద్ ఉన్ నబి వేడుకల్లో డీజేలు నిషేధం

చార్మినార్ PS పరిధిలోని సనా గార్డెన్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీసీపీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో పోలీసులు, జీహెచ్ఎంసీ, విద్యుత్, ఆర్&బీ విభాగాల అధికారులు, సుమారు 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. డీజేలు, పటాకులు నిషేధం అని డీసీపీ స్పష్టం చేస్తూ, కార్యక్రమాలు ప్రశాంతంగా, సమయానికి ముగించాలని తెలిపారు.
News September 12, 2025
ఎంటర్పెన్యూర్షిప్తోనే రాష్ట్రాభివృద్ధి: వ్యాపారవేత్తలు

AP: వ్యాపార రంగం వచ్చే పదేళ్లలో ఎలాంటి పురోగతిని చూడబోతోంది అనే అంశంపై Way2News Conclaveలో తెనాలి డబుల్ హార్స్ MD శ్యాంప్రసాద్, సోనోవిజన్ MD భాస్కర్ మూర్తి, GVమాల్ MD ఉమామహేశ్వర్, విజ్ఞాన్ విద్యా సంస్థల ఛైర్మన్ రత్తయ్య తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉద్యోగాలు కాకుండా సొంత వ్యాపారంతోనే వ్యక్తిగత, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వారు సూచించారు. ఎవరైనా టెక్నాలజీని వ్యాపారంలో భాగం చేసుకోవాలని సూచించారు.