News September 12, 2025

సికింద్రాబాద్: గాంధీలో సేవలు ఇకనైనా గాడిన పడేనా?

image

గాంధీ ఆస్పత్రి అంటేనే తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు ఓ ధైర్యం.. అలాంటిది ఇటీవల ఇందులో సరైన సేవలందడం లేదని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనంతటికీ కారణం సూపరింటెండెంట్ డా.రాజకుమారి నిర్లక్ష్య వైఖరే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ప్రభుత్వం ఆమె స్థానంలో అడిషనల్ DME డా.వాణి నూతన సూపరింటెండెంట్‌ను నియమించింది. ఇప్పుడైనా సేవలు మెరుగుపడతాయేమోనని నగర వాసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Similar News

News March 14, 2026

HYD: 600 ఎకరాల భూమి వేలం!

image

బడ్జెట్‌లో నిధుల లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం నగర శివార్లలోని ప్రభుత్వ భూములను విక్రయించేందుకు సిద్ధమైంది. కోకాపేట, బుద్వేల్ తర్వాత ఇప్పుడు ‘కిస్మత్‌పూర్’, ‘తారామతి-బారామతి’ పరిసరాల్లో సుమారు 600 ఎకరాల వివాదరహిత భూములను వేలం వేయాలని క్యాబినెట్ రహస్యంగా నిర్ణయించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కనీసం ₹15,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

News March 14, 2026

హైదరాబాద్‌లో పెరిగిన ఎయిర్ పొల్యూషన్

image

నగరంలో గాలి నాణ్యత పడిపోతుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రెండంకెల్లో ఉండాల్సిన గాలి నాణ్యత సూచీ శనివారం అంబియాన్స్ పోర్టు హైదరాబాద్‌లో 240గా నమోదైంది. వాహనాల పొగ, చెత్తాచెదారం తగలబెట్టడం కారణంగా కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఇటీవల మొదలైన కట్టెల పొయ్యితో మరింత క్షీణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

News March 14, 2026

మూసీ ప్రక్షాళన: భూసేకరణ గండం.. బడ్జెట్‌లో ‘నిశ్శబ్దం’!

image

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వడం లేదు. లండన్ థేమ్స్ నదిలా మారుస్తామన్న హామీ బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో 3,279 ఎకరాల భూసేకరణ అతిపెద్ద సవాలుగా మారింది. సుమారు 10,017 ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా బాధితుల నుంచి వస్తున్న నిరసనలను అసెంబ్లీలో చర్చకు రాకుండా జాగ్రత్త పడుతోంది. నిధుల సమీకరణపై ‘గోప్యత’ పాటిస్తోంది.