News September 12, 2025

2029లో వచ్చేది NDAనే: చంద్రబాబు

image

AP: దేశంలో, రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 2029లో నరేంద్రమోదీ నాలుగోసారి పీఎం అవుతారని Way2News కాన్‌క్లేవ్‌లో పేర్కొన్నారు. ఆలస్యంగా సాధించే విజన్ 2020, 2047 వంటి సుదీర్ఘ లక్ష్యాల వల్ల రాజకీయంగా నష్టమేమీ ఉండదని స్పష్టం చేశారు. తమ భవిష్యత్తు విజయాలపై సందేహం అవసరం లేదని, ఇది రాసిపెట్టుకోవాలని అన్నారు.

Similar News

News September 12, 2025

ట్రంప్ సన్నిహితుడి హత్య.. ఎందుకు చంపాడంటే?

image

ట్రంప్ సన్నిహితుడు ఛార్లీ కిర్క్‌ను గన్‌తో కాల్చి చంపిన కేసులో నిందితుడు టేలర్ రాబిన్‌సన్(22)ను US పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు విడుదల చేసిన ఫొటోల్లో ఉన్నది టేలరేనని అతడి తండ్రి గుర్తించి లొంగిపోమని చెప్పాడు. ఓ పాస్టర్‌ను సాయం కోరగా ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ‘కిర్క్ పొలిటికల్, విద్వేష ప్రసంగాలు చేస్తున్నాడు’ అని హత్యకు ముందు రోజు రాత్రి టేలర్ ఇంట్లో చెప్పినట్లు అతడి తండ్రి తెలిపారు.

News September 12, 2025

ఎంటర్‌పెన్యూర్‌షిప్‌తోనే రాష్ట్రాభివృద్ధి: వ్యాపారవేత్తలు

image

AP: వ్యాపార రంగం వచ్చే పదేళ్లలో ఎలాంటి పురోగతిని చూడబోతోంది అనే అంశంపై Way2News Conclaveలో తెనాలి డబుల్ హార్స్ MD శ్యాంప్రసాద్, సోనోవిజన్ MD భాస్కర్ మూర్తి, GVమాల్ MD ఉమామహేశ్వర్, విజ్ఞాన్ విద్యా సంస్థల ఛైర్మన్ రత్తయ్య తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉద్యోగాలు కాకుండా సొంత వ్యాపారంతోనే వ్యక్తిగత, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వారు సూచించారు. ఎవరైనా టెక్నాలజీని వ్యాపారంలో భాగం చేసుకోవాలని సూచించారు.

News September 12, 2025

దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. కారణమిదే!

image

UP బరేలీలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఇది తమ పనేనంటూ రోహిత్ గొడారా& గోల్డీ బ్రార్ గ్యాంగ్ SMలో పోస్ట్ చేసింది. ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహరాజ్‌ను అగౌరవపరిచినందుకే కాల్పులు జరిపామంది. ఇది ట్రైలర్ మాత్రమేనని, సాధువులు, సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఎవర్నీ వదలబోమని హెచ్చరించింది. కాగా ఇటీవల అనిరుద్ధాచార్యపై దిశా సోదరి కుష్బూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.