News September 12, 2025
మంచు బద్రర్స్ను ఒక్కటి చేసిన ‘మిరాయ్’!

గత కొంతకాలంగా మంచు బ్రదర్స్ ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తేజా సజ్జ హీరోగా మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించిన ‘మిరాయ్’ ఇవాళ రిలీజవగా మంచు విష్ణు విషెస్ తెలిపారు. దీనికి అనూహ్యంగా మంచు మనోజ్ రిప్లై ఇస్తూ.. ‘ థాంక్యూ సోమచ్ అన్నా. మిరాయ్ జట్టు నుంచి కూడా మీకు థాంక్స్’ అని తెలిపారు. ఇలా ఇద్దరి సంభాషణతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Similar News
News March 3, 2026
కప్పు కొట్టాలంటే ఈ లోపాలు సరిదిద్దుకోవాల్సిందే!

టీమ్ఇండియా సెమీస్కు చేరినప్పటికీ టైటిల్ గెలవడం అంత ఈజీ కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వరుణ్ ఫామ్ కోల్పోవడం, బౌలింగ్లో బుమ్రాపైనే ఆధారపడటం బలహీనతలుగా మారాయి. టోర్నీలో పేలవమైన క్యాచ్ల రికార్డ్ ఆందోళనకరం. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ విఫలమవుతుండటంతో ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరి వ్యక్తిగత మెరుపులపైనే టీమ్ ఆధారపడుతోంది. ఇంగ్లండ్తో పోరులో సమష్టిగా రాణించకపోతే కప్పు కలగానే మిగిలిపోతుంది!
News March 3, 2026
వాళ్లు నన్ను చంపేస్తారు: ఇరాన్ హీరోయిన్

ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వం దిగిపోయేవరకు తాను ఆ దేశంలో అడుగుపెట్టలేనని సాక్రెడ్ గేమ్స్ ఫేమ్, ఇరానియన్ హీరోయిన్ ఎల్నాజ్ నొరౌజీ అన్నారు. ఖమేనీ మృతి విషయం తెలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఇటీవల ఆమె వార్తల్లో నిలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇరాన్ వెళ్తే చంపేస్తారని వ్యాఖ్యానించారు. కాగా ఎనిమిదేళ్ల వయసులో ఆమె ఇరాన్ను వీడారు. తర్వాత యూరప్లో మోడలింగ్ నేర్చుకున్నారు. ప్రస్తుతం INDలోనే ఉన్నారు.
News March 3, 2026
ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

TG: బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని CM రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందంటూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. 12 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రాన్ని BRS, INC అప్పుల కుప్ప చేశారని మండిపడ్డారు.


