News April 4, 2024

కండువా మారిస్తే అంతా క్లీన్! – 2/2

image

ఈ లిస్ట్‌లోని 23 మందిలో ముగ్గురి కేసులు క్లోజ్ కాగా మరో 20 మంది కేసులు మూలనపడినట్లు IE వెల్లడించింది. ‘2014లో శారదా స్కామ్ కేసులో CBI దాడులు ఎదుర్కొన్న హిమంత బిశ్వ శర్మ (అస్సాం ప్రస్తుత సీఎం) 2015లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత కేసు ఫైల్ కదలలేదు. బెంగాల్‌లో సువేందు అధికారి, మహారాష్ట్రలో BJPతో చేతులు కలిపిన అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ విషయంలోనూ ఇదే జరిగింది’ అని పేర్కొంది.
<<-se>>#Elections2024<<>>

Similar News

News March 19, 2026

రంజాన్ ఎల్లుండే..

image

భారత్‌లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)ను మార్చి 21న జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. ఇవాళ ఆకాశంలో నెలవంక కనిపించలేదని పేర్కొన్నారు. రంజాన్ మాసం రేపటి (మార్చి 20)తో ముగియనుందని చెప్పారు. దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

News March 19, 2026

రేపే బడ్జెట్.. ఆరు కొత్త పథకాలు!

image

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా యంగ్ ఇండియా కిట్స్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ, పాడి రైతులకు రాయితీపై పశువుల సరఫరాను ప్రకటించే అవకాశం ఉంది. మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.

News March 19, 2026

ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై ఢిల్లీ హైకోర్టుకు గంభీర్

image

టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొందరు తన పేరు, ఫొటోలు, ఐడెంటిటీని ఆయుధాలుగా వాడుకుంటున్నారని, ఏఐ సాయంతో డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి పోస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. వాటి వల్ల తన పరువుకు భంగం కలిగిందని పేర్కొన్నారు. తనపై పోస్టులు చేసిన ఖాతాలు, ఫేక్ కంటెంట్‌ను తొలగించాలని, రూ.2.5కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.