News September 12, 2025
2, 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి: సీఎం

AP: మెడికల్ కాలేజీల PPP విధానంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘జగన్ ఐదేళ్లలో ఎన్ని కాలేజీలు కట్టారు? కట్టకపోయినా కట్టానని ప్రచారం చేసుకున్నారు. మేము PPP విధానం తెచ్చినా కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే రన్ అవుతాయి. ఓపీ ఫ్రీగా ఉంటుంది. రెండు, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఆపరేట్ అవుతాయి. ఓపెన్ కాంపిటీషన్లో వచ్చే సీట్లు కూడా ముందు కంటే ఎక్కువగా ఉంటాయి’ అని Way2News కాన్క్లేవ్లో తెలిపారు.
Similar News
News March 6, 2026
ఇరాన్పై US దాడులు.. ఏఐతో సెకన్లలో ప్లానింగ్!

US మిలిటరీకి AI కొత్త అస్త్రంగా మారింది. ఇరాన్పై దాడులు స్టార్ట్ చేసినప్పుడు 12 గంటల్లో 900కుపైగా లక్ష్యాలపై అటాక్ ఏఐతోనే సాధ్యమైంది. మేవెన్ స్మార్ట్ సిస్టమ్ 150కిపైగా సోర్సుల నుంచి రహస్య డేటా సేకరించి సెకన్లలో టార్గెట్స్ సెట్ చేసింది. సాధారణంగా ఈ ప్రక్రియకు కొన్నిరోజులు పడుతుంది. అయితే పాత డేటాతో తప్పుడు లక్ష్యాలపై దాడి జరిగే ప్రమాదం ఉంది. స్కూల్పై <<19288920>>దాడి<<>> అలాగే అయి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.
News March 6, 2026
తెలంగాణకు కొత్త గవర్నర్

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. ఇక TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్గా నంద్ కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్గా సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్గా R.N. రవిని నియమించింది.
News March 6, 2026
దీదీకి కొత్త తలనొప్పి?

ఎన్నికల వేళ బెంగాల్ గవర్నర్గా ఆర్ఎన్ <<19306866>>రవి<<>> రావడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 2021లో తమిళనాడుకు గవర్నర్గా వచ్చిన రవి డీఎంకే ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. రాష్ట్ర పాలసీను విభేదించడం, బిల్లులు ఆమోదించకపోవడం వంటివి చేసి వివాదాలకు కేరాఫ్గా నిలిచారు. ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్గా రవి వైఖరి ఎలా ఉంటుందోనని తృణమూల్ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.


