News September 12, 2025
జనగామ: యాత్రాదానం బస్సు బహుమతిగా ఇవ్వాలి: కలెక్టర్

జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. “యాత్రాదానం – బస్సును బహుమతిగా ఇవ్వండి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులకు పారదర్శకంగా ప్రయోజనం చేకూరేలా చూడాలని ఆదేశించారు. పథకం అమలులో నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. ప్రయాణికులు, యాత్రీకులు, సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News March 14, 2026
MBNR: టెన్త్ పరీక్షలు.. ఎస్పీ కీలక ఆదేశాలు

టెన్త్ పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల పరిసరాలలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. పరీక్ష ప్రాంతాలలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డిజేలు ఉపయోగించి ఉరేగింపులు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. సెక్షన్-163 అమలు చేస్తున్నట్లు తెలిపారు.
News March 14, 2026
ఆదిలాబాద్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్ విడుదలైనట్లు KU అధికారులు పేర్కొన్నారు. KU పరిధిలోని ఉమ్మడి. ఆదిలాబాద్ జిల్లాలో 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 9వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో పరీక్షలు ఉంటాయని తెలిపారు.
News March 14, 2026
సంగారెడ్డి: ఎస్సీలకు 409 యూనిట్లు మంజూరు

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంగారెడ్డి జిల్లాలోని షెడ్యూలు కులాల అభ్యర్థులకు 409 యూనిట్లు మంజూరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. లబ్ధిదారులకు రూ. 8.21 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా ఎస్సీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యమని, వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.


