News September 12, 2025
చిత్తూరు జిల్లాలోని ఈ మండలాల్లో రేపు పవర్ కట్

జిల్లాలోని వివిధ మండలాలలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు EE మునిచంద్ర పేర్కొన్నారు. మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చిత్తూరు అర్బన్, రూరల్, గుడిపాల, యాదమరి, ఐరాల, తవణంపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు మండలాలలో సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
Similar News
News March 22, 2026
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.190, మాంసం 300 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.310 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 21, 2026
చిత్తూరు: ఐదుగురు DTలకు విధులు

గ్రూప్-2 పరీక్షల్లో DTలుగా ఎంపికైన వారిలో 16 మందిని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కేటాయించారు. చిత్తూరు జిల్లాకు 5 మందిని కేటాయించగా వారిలో.. శివకుమార్, మదన్ మోహన్ రెడ్డి, యస్థాని బాషా, సుధాకర్, శశికిరణ్ ఉన్నారు. వీరు ఏడాది పాటు రెవెన్యూ విభాగంలో ప్రొబేషన్ కింద జిల్లాలో విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
News March 20, 2026
చిత్తూరు: మూతపడుతున్న పెట్రోల్ బంకులు

బంకులకు పెట్రోల్ సరఫరా తగ్గడంతో స్టాక్ లేక పలు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండగా స్టాక్ త్వరగా అయిపోతుంది. అయితే ఇందన సరఫరా ఆలస్యం అవుతుండడంతో స్టాక్ లేక పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. హైవేపై ఉన్న బంకుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.


