News September 12, 2025
ఆసిఫాబాద్: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి ఆయన వీసీ ద్వారా ఎంపీడీవోలు, ఉపాధి హామీ, హౌసింగ్, ఏపీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన తాగునీటి సరఫరా, మొక్కల పెంపకం, మౌలిక వసతుల పనులపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News March 14, 2026
ANU దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సర్వసిద్ధం

ANU దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 15న జరిగే MBA, MCA ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం చేసినట్లు CDE డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులను ఆదివారం మధ్యాహ్నం 12గంటల లోపు పూర్తి చేసి పత్రాలను పరీక్ష కేంద్రంలో చూపించాలన్నారు. దరఖాస్తులు అందించని అభ్యర్థులు నేరుగా ఆధార్ కార్డు, అభ్యర్థి ఫోటో తోపాటు రూ.500 తత్కాల్ ఫీజు చెల్లించి పరీక్ష కేంద్రాలలో నేరుగా హాజరు కావచ్చన్నారు.
News March 14, 2026
విధులు నిర్వాహణలో నిర్లక్ష్యం వహించరాదు: SKLM కలెక్టర్

విధులు నిర్వాహణలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పైపులైన్ కనెక్షన్లుపై ఎమినిటి సెక్రటరీస్, మున్సిపల్ అధికారులతో శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న డ్రైనేజీ పనులు, మంచినీటి పైపులైన్లు పనుల్లో ఎక్కడ రాజీ పడకుండా వేగవంతం చేయాలని ఆదేశించారు. అధికారులు అలసత్వంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
News March 14, 2026
జగిత్యాల : పదవ తరగతి పరీక్షలలో 11 మంది గైర్హాజరు

జగిత్యాల జిల్లాలో శనివారం జరిగిన పదవ తరగతి పరీక్షలలో 11 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాము తెలిపారు. 68 పరీక్ష కేంద్రాలలో 12684 మంది విద్యార్థులకు గాను 12673 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు పేర్కొన్నారు. 99.91 % హాజరు శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. సప్లిమెంటరీ విద్యార్థులు 12 మందికి గాను 12 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.


