News September 12, 2025

రాష్ట్రంలో మరోసారి కుల గణన: సిద్దరామయ్య

image

కర్ణాటకలో మరోసారి కుల గణన చేయాల్సిన అవసరం ఉందని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ‘సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా మరోసారి సర్వే నిర్వహించబోతున్నాం. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ గణన జరుగుతుంది. 2015లో నిర్వహించిన సర్వే రిపోర్టును ప్రభుత్వం ఆమోదించలేదు. పదేళ్లు గడిచిపోయాయి. తాజాగా మరోసారి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమైన సామాజిక న్యాయం దక్కాలి’ అని తెలిపారు.

Similar News

News March 19, 2026

అల్లికల్లో మహిళల ప్రతిభ ప్రశంసనీయం: కలెక్టర్

image

నిడదవోలు మండలంలోని సెట్టిపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ యూనిట్‌ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. మహిళలు చేతి అల్లికలతో రూపొందించిన వివిధ రకాల దుస్తులను ఆమె ఆసక్తిగా పరిశీలించి, వారి నైపుణ్యాన్ని అభినందించారు. తరతరాలుగా ఈ కళను నమ్ముకుని, ప్రత్యేక గుర్తింపు పొందడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.

News March 19, 2026

EPF పెన్షన్ ₹1000 సరిపోదు: పార్లమెంటరీ ప్యానెల్

image

ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద నెల వారీ పెన్షన్ కేవలం ₹1000 ఇస్తుండడాన్ని తక్షణమే సమీక్షించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సూచించింది. గౌరవప్రదమైన స్థాయిలో ప్రజల పెన్షన్లు ఉండాలని పేర్కొంది. కనీస పెన్షన్ ₹7,500 చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. జీవనవ్యయం పెరిగినా అమౌంట్ మారలేదని.. బడ్జెట్‌లో కేటాయింపులు పెంచే విషయాన్ని పరిశీలించాలని కమిటీ పేర్కొంది.

News March 19, 2026

TODAY HEADLINES

image

✏ ఏపీలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం
✏ 2029లో BRS ఎలా గెలుస్తుందో చూస్తా: సీఎం రేవంత్
✏ తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ డెలివరీలు
✏ జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు: షర్మిల
✏ డొమెస్టిక్ LPG ఉత్పత్తి 40% పెరిగింది: కేంద్రం
✏ గల్ఫ్‌ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్‌పై దాడులు చేస్తాం: ఇరాన్ హెచ్చరిక
✏ ఐపీఎల్: SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్