News September 12, 2025
ఆశించిన స్థాయిలో లేని చేప పిల్లల పెంపకం

నెల్లూరు జిల్లాలో సుమారు 78 సొసైటీలు, 110 పంచాయతీ చెరువులు ఉన్నాయి. సోమశిల రిజర్వాయర్ నిండడంతో కింది చెరువులకు ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. అయితే చేప పిల్లల పెంపకం కేంద్రాలను గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం 20 లక్షల చేప పిల్లల లక్ష్యం సాధ్యం కాకపోతోంది. సోమశిల, పడుగుపాడు కేంద్రాలు మూతపడి భవనాలు శిథిలమయ్యాయి. ప్రస్తుతం కొద్దిపాటి తొట్టెల్లోనే పిల్లల పెంపకం జరుగుతోంది.
Similar News
News March 10, 2026
కావలి: మామిడి తోటలో ఉరి వేసుకొని వ్యక్తి మృతి

కావలి రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన నూకల పాటి శివప్రసాద్ రెడ్డి (65) మంగళవారం మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి కాంతమ్మ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుమల్ రెడ్డి తెలిపారు. అనారోగ్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
News March 10, 2026
నెల్లూరు: మహిళ దారుణ హత్య

నెల్లూరు వనంతోపు సెంటర్కు చెందిన వెంకయ్య, తన భార్య హజరత్తమ్మ (41)ను రాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. వీరు పల్నాడు జిల్లా నరసరావుపేట(M) ఇసప్పాలెం మహంకాళి తిరునాళ్లకు వెళ్లారు. ఆ సమయంలో ఘర్షణ చోటుచేసుకుని హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు నరసరావుపేట పోలీసులు స్పందించి, నిందితుడు వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారు. పాత సామాన్లు ఏరుకుంటూ జీవనం సాగించేవారని గుర్తించారు.
News March 10, 2026
25,305 మంది ఆడపిల్లలకు HPV వ్యాక్సిన్: DMHO

జిల్లాలోని 52 PHC, 29 పట్టణ PHCలు, 10 CHCలతోపాటు GGH ఆత్మకూరు, కావలి, గూడూరు ఏరియా ఆసుపత్రులలోనూ ఈ HPV వ్యాక్సిన్ను సరఫరా చేస్తున్నట్లు DMHO సుజాత తెలిపారు. ఉచితంగా వేసే ఈ HPV వ్యాక్సిన్ను ఎంపిక చేసిన ఆడపిల్లలకు 0.5 ml డోస్ను బుధవారం నుంచి ఇవ్వననున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 14 ఏళ్లు పైడి 15 ఏళ్లలోపు ఆడపిల్లలు 25,305 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు.


