News September 12, 2025

హైదరాబాద్‌లో అతిపెద్ద ఎగ్జిబిషన్ నవంబర్‌లో

image

భాగ్యనగరం మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదిక కానుంది. దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగ్జిబిషన్ నవంబర్ 25 నుంచి జరుగనుంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో వివిధ దేశాలకు చెందిన దాదాపు 500 మంది ఎగ్జిబిటర్లు, 50 వేల మంది సందర్శకులు పాల్గొంటారని పౌల్ట్రీ అసోసియేషన్ నాయకులు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. హైటెక్ సిటీలోని నోవాటెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News March 10, 2026

HYD: మూడు ముక్కలు.. కానీ ‘POWER’ అక్కడే!

image

గ్రేటర్ HYDను 3 కార్పొరేషన్లు(GHMC, MMC, CMC)గా విభజించారు. అయితే తెలంగాణ మున్సిపల్ చట్టం(సవరణ) 2024 ప్రకారం 10 అంతస్తులపైన కట్టే ‘హై రైజ్’ బిల్డింగుల పర్మిషన్ ఫీజు ఇకపై నేరుగా HMDA ఖాతాలోకి వెళ్తుంది. అంటే కొత్తగా ఏర్పడిన MMC, CMCలకు కేవలం డ్రైనేజీ, చెత్త ఏరడం వంటి ఖర్చులతో కూడిన పనులే మిగిలాయి. ఆదాయం వచ్చే పర్మిషన్ల పవర్ లేకపోవడంతో ఈ సంస్థలు భవిష్యత్తులో జీతాల కోసం అప్పులు చేయక తప్పని పరిస్థితి.

News March 10, 2026

REWIND: పోలీసుల కళ్లుగప్పి.. పడవలో ట్యాంక్ బండ్‌కు..!

image

15ఏళ్ల క్రితం మిలియన్ మార్చ్ వేళ ట్యాంక్‌ బండ్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఉద్యమాన్ని అడ్డుకోవాలని ఆందోళనకారులు నెక్లెస్ రోడ్డుకు రాకుండా పోలీసులు నలుదిక్కులా మోహరించారు. అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులు, అరెస్టులతో నిలువరించారు. దీంతో అప్పట్లో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ పరిస్థితుల్లో ఉద్యమనేత హరీశ్‌రావు హుస్సేన్‌సాగర్‌లో పడవలో ప్రయాణించి ట్యాంక్‌ బండ్‌కు చేరుకొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.

News March 10, 2026

ట్యాంక్ బండ్‌పై త్వరలో ‘బహుజన బిడ్డ’ విగ్రహం..!

image

తెలంగాణ గడ్డ గర్వించదగ్గ వీరపుత్రుల్లో ఒకరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం త్వరలో ట్యాంక్ బండ్‌ సమీపంలోని BPP ఆఫీస్ దగ్గర మెరవనుంది. ఎందరో మహానుభావుల సరసన ఈ మట్టి బిడ్డ నిలువెత్తు విగ్రహం కొలువుదీరనుండటం మన ఆత్మగౌరవానికి ప్రతీక. సుమారు రూ.3.18 కోట్ల అంచనాతో, కేవలం 5 నెలల్లో ఈ నిర్మాణం పూర్తికానుందని HMDA అధికారులు తెలిపారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన పాపన్న మనందరికీ గర్వకారణం.