News September 12, 2025
భీమారంలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం

భీమారం జడ్పీహెచ్ఎస్లో శుక్రవారం సోషల్ స్టడీస్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం జరిగింది. స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ జి.శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి హాజీపూర్, మంచిర్యాల, నస్పూర్, భీమారం, జైపూర్ మండలాల ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యాశాఖ సూచించిన ఎజెండా ప్రకారం ఈ సమావేశం నిర్వహించినట్లు ఎంఈఓ గోపాల్ రావు తెలిపారు.
Similar News
News March 4, 2026
విశాఖ కలెక్టరేట్లో జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ సమావేశం

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో జరిగిన విద్యుత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ చోరీలను అరికట్టాలని, ఆర్డీఎస్ఎస్ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేసి వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
News March 4, 2026
RITES లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News March 4, 2026
చర్చల ప్రసక్తే లేదు.. సుదీర్ఘ యుద్ధమే: ఇరాన్

చర్చలపై US అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<19290770>>వ్యాఖ్యలపై<<>> ఇరాన్ స్పందించింది. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీ స్పష్టం చేశారు. సుదీర్ఘ యుద్ధానికి తమను తాము సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 2 దేశాల మధ్య డిస్కషన్స్ జరుగుతుండగానే ద్వేషంతో ట్రంప్ దాడులు చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మండిపడ్డారు. అణు చర్చలను రియల్ ఎస్టేట్ లావాదేవీల్లా మార్చారని ఫైరయ్యారు.


