News September 12, 2025
చాగలమర్రి: కుందూ నదికి పోటెత్తిన వరద

భారీ వర్షాల కారణంగా చాగలమర్రి మండలం కుందూ నదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాగలమర్రి మండలంలో 13 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కుందూ నదిలో 28 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చాగలమర్రి తహశీల్దార్ విజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 26, 2026
మార్కాపురం: చికిత్స పొందుతున్న వారి వివరాలివే.. 1/2

మార్కాపురం బస్సు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారి వివరాలను అధికారులు వెల్లడించారు. 1.అబ్రహం, 2.ప్రవీణ్ (వెలిగండ్ల), 3.లక్ష్మీ కుమారి, 4.మహేంద్రారెడ్డి, 5.తిరుపాలు, 6.మనోహర్, 7.యువరాజ్, 8.మౌనిక,9. శ్రీహరి (కనిగిరి), 10.గురవయ్య (చింతకుంట్ల, నెల్లూరు జిల్లా), 11.జేమ్స్, 12.చిట్టిబాబు (పీసీపల్లి), 13.యోహాను (భూపాలపురం), 14.మనోహర్ (పామూరు), 15.సౌజన్య (కొనకనమిట్ల), 16.బాలరాజు (HMపాడు) <<19486702>>continue<<>>
News March 26, 2026
గంగవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గంగవరం మండలం, మేలుమాయి క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడు. మేలుమాయి క్రాస్కు చెందిన దొరస్వామి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఇద్దరు విద్యార్థులు మరో బైక్పై వస్తూ ఢీకొట్టారు. స్థానికులు హుటాహుటిన పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News March 26, 2026
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

*గద్వాల: రాములోరి కళ్యాణానికి ఆలయాలు ముస్తాబు
*ఇటిక్యాల: కలెక్టర్ పర్యటన- కార్యాలయాలు తనిఖీ
*ఎస్సీ యాక్షన్ ప్లాన్ కు ఏప్రిల్ 2 వరకు గడువు
*అలంపూర్: జోగులాంబ ఆలయానికి మంచినీటి కూలర్
*రాజోలి: పేదింటి అమ్మాయి పెళ్ళికి రూ.2 లక్షలు సహాయం
*ఇటిక్యాల: పాలకులు మారినా ప్రజా సమస్యలు తీరలేదు
*అయిజ: మిషన్ భగీరథ కనెక్షన్కు మోటార్లు అమర్చితే చర్యలు
*ధరూర్: కూలీ డబ్బులు విడుదల చేయాలని ఆందోళన


