News September 12, 2025

‘సిరిసిల్లలో రేపు లోకాదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

సిరిసిల్లలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్‌పర్సన్, న్యాయమూర్తి పి.నీరజ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో ఉ.10.30 గంటల నుంచి జాతీయ లోక్ అదాలత్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు వారి సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.

Similar News

News September 13, 2025

HYD: ప్రకృతే మెడిసిన్.. ఆరోగ్యానికి ఇలా చేయండి

image

మనసును, శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. టాబ్లెట్లు, మెడిసిన్లు మాత్రమే సరిపోవు! ప్రతిరోజు వ్యాయామం, స్వచ్ఛమైన పర్యావరణం, పౌష్టిక ఆహారం, కూరగాయలు, సూర్య రష్మీ, ఫాస్టింగ్, నవ్వుతూ గడపడం, సరైన నిద్ర, మెడిటేషన్, స్నేహితులతో గడపడం, సేవ చేయడమే మన ప్రకృతి మెడిసిన్ అని మల్కాజిగిరి DCP పద్మజ అన్నారు. పూర్తి స్థాయి ఆరోగ్యంగా జీవించండి!

News September 13, 2025

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి

image

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ.3,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. సూపర్ ఫైన్ రకం అంచనాలకు మించి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే రేషన్ బియ్యంలో నాణ్యత పెంచుతామని చెప్పారు.

News September 13, 2025

ములుగు: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 91 మందికి జరిమానా

image

మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ 91 మందికి ములుగు కోర్టు జరిమానా విధించిందని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 85 మందికి రూ.1,68,000 జరిమానా, ఆరుగురికి రెండు రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.12000 జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం తాగి వాహనం నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.