News September 12, 2025

‘సిరిసిల్లలో రేపు లోకాదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

సిరిసిల్లలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్‌పర్సన్, న్యాయమూర్తి పి.నీరజ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో ఉ.10.30 గంటల నుంచి జాతీయ లోక్ అదాలత్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు వారి సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.

Similar News

News March 5, 2026

NZB: కొడుకును నరికి చంపాడు!

image

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో దారుణం జరిగింది. గంజాయికి అలవాటు పడి నిత్యం వేధిస్తున్న కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. నల్లవెల్లికి చెందిన కొత్తగొల్ల భాను ప్రకాశ్(23) మత్తుకు బానిసై డబ్బులు ఇవ్వాలంటూ నిత్యం వేధిస్తూ నిన్న రాత్రి కూడా ఇబ్బంది పెట్టడంతో తండ్రి కిషన్ నరికి చంపాడు. అనంతరం ఇందల్వాయి పొలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

News March 5, 2026

చిత్తూరులో జాతీయ జెండా ఎగిరి.. 30 రోజులకు పైనే

image

చిత్తూరు జిల్లా కేంద్రంలో మువ్వన్నెల జాతీయ జెండా ఎగిరి ముచ్చటగా 30 రోజులకు పైనే అయింది. నగరంలోని గాంధీ కూడలి వద్ద “ఐ లవ్ చిత్తూరు” పార్కులో భారీ ఎత్తులో జాతీయ జెండా స్తంభం ఏర్పాటుచేసి అందులో జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అధికారులు జెండాను ఘనంగా ఆవిష్కరించిన అనంతరం దాదాపు జాతీయ జెండా ఎగరలేదు. స్తంభం మాత్రమే దర్శనమిస్తోంది. మన జాతీయ జెండా ఎగరడానికి దృష్టి పెట్టండి సారూ.!

News March 5, 2026

HYDలో వరుస ప్రమాదాలు.. జాగ్రత్త!

image

సిటీలో వరుసగా సంభవిస్తున్న ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. గత 2 నెలల్లో పదుల సంఖ్యలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. బాచుపల్లి ఘటన మరవక ముందే కాటేదాన్‌లో ఉదయం మంటలు చెలరేగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున అగ్నిప్రమాదాలకు అవకాశం ఉందని హైడ్రా, అగ్నిమాపక బృందాలు హెచ్చరిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ పాటించాలని సూచిస్తున్నాయి.