News September 12, 2025
ప్రమాదానికి గురైన వ్యక్తి మృతి

బాపట్లలో శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్ వద్ద కళాశాల బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో న్యాయవాది చిన్నుకొని జనార్దన్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించగా, మెరుగైన చికిత్సకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. న్యాయవాది మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Similar News
News September 13, 2025
‘రాజాసాబ్’ రిలీజ్ను అందుకే వాయిదా వేశాం: నిర్మాత

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ 80% పూర్తయినట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. నవంబర్ నెలాఖరు నాటికి సినిమా మొత్తం రెడీ అవుతుందన్నారు. సంక్రాంతి సీజన్ కోసమే డిసెంబర్ 5 నుంచి జనవరి 9వ తేదీకి రిలీజ్ను వాయిదా వేశామన్నారు. విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్’ నిన్న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో VFX వర్క్పై ప్రశంసలొస్తున్నాయి.
News September 13, 2025
HYD: ప్రకృతే మెడిసిన్.. ఆరోగ్యానికి ఇలా చేయండి

మనసును, శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. టాబ్లెట్లు, మెడిసిన్లు మాత్రమే సరిపోవు! ప్రతిరోజు వ్యాయామం, స్వచ్ఛమైన పర్యావరణం, పౌష్టిక ఆహారం, కూరగాయలు, సూర్య రష్మీ, ఫాస్టింగ్, నవ్వుతూ గడపడం, సరైన నిద్ర, మెడిటేషన్, స్నేహితులతో గడపడం, సేవ చేయడమే మన ప్రకృతి మెడిసిన్ అని మల్కాజిగిరి DCP పద్మజ అన్నారు. పూర్తి స్థాయి ఆరోగ్యంగా జీవించండి!
News September 13, 2025
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ.3,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. సూపర్ ఫైన్ రకం అంచనాలకు మించి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే రేషన్ బియ్యంలో నాణ్యత పెంచుతామని చెప్పారు.