News September 12, 2025
జగిత్యాల: పంచాయతీ భవనాలు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

గ్రామపంచాయతీ భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్ లో పంచాయతీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, భవిత సెంటర్లు, పాఠశాలల్లో గల కిచెన్ షెడ్, సౌచాలయాల నిర్మాణాలపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు తదితరులున్నారు.
Similar News
News March 12, 2026
ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, వడగాల్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిన్నారులు, పశువుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.
News March 12, 2026
రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

TG: మండుతున్న ఎండలు, ఉక్కపోతకు ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని పేర్కొంది. అప్పటివరకు ఎండలు దంచి కొట్టనున్నాయని వెల్లడించింది.
News March 12, 2026
నిర్మల్: ‘ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి’

ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం గొప్ప విషయం అని, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పరిష్కరించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు.


