News September 12, 2025
వంగూర్: బైక్పై నుంచి జారిపడి మహిళ మృతి

బైక్పై నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన వంగూర్ మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట(M) అక్కారం తాండాకు చెందిన బాలునాయక్ తన భార్య కళతో కలిసి కల్వకుర్తి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వంగూర్ గేటు వద్ద బైక్పై నుంచి కళ ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News September 13, 2025
ADB: హ్యాట్సాప్.. ఆ నలుగురు టీమ్

జీవితంలో ఎవరికైనా సహాయం చేయాలంటే డబ్బు మాత్రమే కాదని మంచి మనసు కూడా కావాలని 10 మందితో కూడిన ‘ఆ నలుగురు’ టీమ్ నిరూపిస్తోంది. గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో గత 5 సంవత్సరాలుగా గ్రామంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియలకు 10 మంది కలిసి రూ.5,500 స్వతహాగా అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆఖరి మజిలిలో అందరికీ అండగా నిలుస్తున్న వారి తీరుపై అంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News September 13, 2025
‘రాజాసాబ్’ రిలీజ్ను అందుకే వాయిదా వేశాం: నిర్మాత

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ 80% పూర్తయినట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. నవంబర్ నెలాఖరు నాటికి సినిమా మొత్తం రెడీ అవుతుందన్నారు. సంక్రాంతి సీజన్ కోసమే డిసెంబర్ 5 నుంచి జనవరి 9వ తేదీకి రిలీజ్ను వాయిదా వేశామన్నారు. విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్’ నిన్న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో VFX వర్క్పై ప్రశంసలొస్తున్నాయి.
News September 13, 2025
HYD: ప్రకృతే మెడిసిన్.. ఆరోగ్యానికి ఇలా చేయండి

మనసును, శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. టాబ్లెట్లు, మెడిసిన్లు మాత్రమే సరిపోవు! ప్రతిరోజు వ్యాయామం, స్వచ్ఛమైన పర్యావరణం, పౌష్టిక ఆహారం, కూరగాయలు, సూర్య రష్మీ, ఫాస్టింగ్, నవ్వుతూ గడపడం, సరైన నిద్ర, మెడిటేషన్, స్నేహితులతో గడపడం, సేవ చేయడమే మన ప్రకృతి మెడిసిన్ అని మల్కాజిగిరి DCP పద్మజ అన్నారు. పూర్తి స్థాయి ఆరోగ్యంగా జీవించండి!