News September 12, 2025
గోదావరిఖని నుంచి గోవా.. రయ్.. రయ్..!

గోదావరిఖని బస్టాండ్ నుంచి ఈనెల 23వ తేదీ ఉ.10 గంటలకు రాజధాని ఏసీ బస్ మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం అనంతరం గోవా చేరుకుని తిరిగి 28వ తేదీన గోదావరిఖని చేరుకుంటుందని GDK RTC DM నాగభూషణం తెలిపారు. టికెట్ ధర రూ.8,000 ఉంటుందని, పూర్తి వివరాలతోపాటు టికెట్ల రిజర్వేషన్ కోసం 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Similar News
News September 13, 2025
వందకు పైగా రాఫెల్ జెట్ల కొనుగోలుకు IAF ప్రతిపాదన

మేడ్ ఇన్ ఇండియా కింద 114 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) డిఫెన్స్ మినిస్ట్రీకి ప్రతిపాదన సమర్పించింది. ఇది రక్షణ రంగంలో అతిపెద్ద డీల్(విలువ ₹2L Cr) అని తెలుస్తోంది. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్, ఇండియన్ కంపెనీలు వీటిని తయారు చేయనున్నాయి. వీటిలో 60% స్వదేశీ కంటెంట్ వాడనున్నారు. అటు డసాల్ట్ సంస్థ HYDలో మెయింటెనెన్స్ ఫెసిలిటీ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
News September 13, 2025
చెమట సుక్కకు సలాం కొట్టిన MHBD ఎస్పీ

మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ జిల్లా వ్యాప్తంగా రైతన్నలకు యూరియా అందించడంలో నిరంతరం శ్రమిస్తున్న హమాలీ కార్మికుల శ్రమను అభినందించారు. నర్సింహులపేటలోని యూరియా పంపిణీ కేంద్రాన్ని సందర్శించి, హమాలీలతో మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు అండగా నిలవాలనే ప్రభుత్వ సంకల్పంలో హమాలీల పాత్ర కీలకమని, వారి శ్రమ వెలకట్టలేనిదని కొనియాడారు. జిల్లాలో యూరియా పంపిణీ సజావుగా సాగుతోందన్నారు.
News September 13, 2025
ADB: హ్యాట్సాప్.. ఆ నలుగురు టీమ్

జీవితంలో ఎవరికైనా సహాయం చేయాలంటే డబ్బు మాత్రమే కాదని మంచి మనసు కూడా కావాలని 10 మందితో కూడిన ‘ఆ నలుగురు’ టీమ్ నిరూపిస్తోంది. గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో గత 5 సంవత్సరాలుగా గ్రామంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియలకు 10 మంది కలిసి రూ.5,500 స్వతహాగా అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆఖరి మజిలిలో అందరికీ అండగా నిలుస్తున్న వారి తీరుపై అంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.