News September 12, 2025
పెద్దపల్లి: బాలికపై అత్యాచారం.. జైలు శిక్ష

పెద్దపల్లి PS పరిధిలో POCSO కేసులో నిందితుడు మందల రవి(41)ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు పదేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.10,000జరిమానాను కోర్టు విధించింది. బాధితులకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా రూ.2లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2017లో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు విచారించి, కోర్టులో సాక్ష్యాలు సమర్పించి నేరాన్ని నిరూపించడంతో DIG అభినందించారు.
Similar News
News March 11, 2026
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> స్టేషన్ ఘనపూర్: కారు బైక్ ఢీ ఇద్దరికీ తీవ్ర గాయాలు
> జనగామ: సర్వికల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి టీకా
> జనగామ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సులు
> ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
> వంట గ్యాస్ ధరలను తగ్గించాలని జిల్లా వ్యాప్తంగా నిరసన
> పాలకుర్తి: వీధి కుక్కల దాడిలో 13 గొర్రెల మృతి
> మల్లికార్జున ఖర్గేను కలిసిన వరంగల్ ఎంపీ కావ్య
News March 11, 2026
కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్

కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించి భోజనం రుచికరంగా వండాలని వంట సిబ్బందిని జిల్లా కలెక్టర్ హైమవతి ఆదేశించారు. నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి రాత్రి భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, దోసకాయ కూర, సాంబారు, పెరుగును పరిశీలించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని ఆదేశించారు.
News March 10, 2026
గ్యాస్ కొరత.. మొబైల్, ఇంటర్నెట్పై ఎఫెక్ట్?

LPG కొరతతో మొబైల్, ఇంటర్నెట్ సేవలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. టెలికాం టవర్ తయారీ సంస్థలకు గ్యాస్ సప్లై నిలిచిపోవడమే ఇందుకు కారణం. టెలికం టవర్లు తుప్పుపట్టకుండా తయారీ సమయంలో జింక్తో వేసే రక్షణ పొరకు LPG/LNG అవసరం. ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్కు తగిన LPG లేకపోతే ఆపరేషన్స్ నిలిపివేయాల్సి వస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీంతో నెట్వర్క్ విస్తరణ నెమ్మదించి కనెక్టివిటీపై ప్రభావం పడుతుందని తెలిపారు.


