News September 12, 2025

అన్నమయ్య: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. ఇద్దరి మృతి

image

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట వద్దగల చెన్నకేశవస్వామి గుడి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళంపల్లికి చెందిన అంకమ్మ(70), రామచంద్రయ్య(50) మరో వ్యక్తి రోడ్డు దాటుతుండగా బెంగళూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Similar News

News March 13, 2026

ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్

image

జిల్లాలో గృహ అవసరాలకు సరిపడా ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు. బుధవారం భువనగిరి పట్టణ కేంద్రంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎల్పీజీ గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ’ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిలిండర్ల సరఫరాలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News March 13, 2026

పెరిగిన విమాన టికెట్ల ధరలు!

image

ఆయిల్ ధరలు పెరగడంతో టికెట్లపై ఇంధన సర్‌ఛార్జ్‌లు విధించాలని ఎయిర్‌లైన్స్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా వసూలు చేస్తుండగా, తాజాగా ఇండిగో కూడా పెంచింది. రేపటి నుంచి సర్వీసులను బట్టి ₹425-2,300 అదనంగా ఛార్జ్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ కూడా అదే దారిలో వెళ్తాయని తెలుస్తోంది. ఈమేరకు అంతర్గత చర్చలు జరుపుతున్నాయని, త్వరలో ధరలు ఖరారు చేస్తాయని సమాచారం.

News March 13, 2026

KTDM: పరీక్షల భయంతో పదో తరగతి విద్యార్థి సూసైడ్

image

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్ష్మీదేవిపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. అశోక్‌నగర్‌ మామిడితోట కాలనీకి చెందిన అప్పం నితీష్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అవుతాననే భయంతో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ రమణారెడ్డి తెలిపారు.