News April 4, 2024
పవన్ అలా చెప్పడం బాధాకరం: ముద్రగడ

పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, మైనార్టీ పెద్దలు గురువారం కిర్లంపూడిలో మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను కలిశారు. సీఎం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలనే అమలు చేస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ గెలిస్తే నాణ్యమైన బ్రాందీని అందిస్తానని పవన్ అనడం బాధాకరమన్నారు. బౌన్సర్లతో ప్రచారం చేసే పవన్ ప్రజలకు అందుబాటులో ఎలా ఉంటారని ప్రశ్నించారు.
Similar News
News March 14, 2026
RJY: డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా

ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగ మద్యం, గంజాయి సేవనం, జూదం, చైన్ స్నాచింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయడమే లక్ష్యంగా రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాడుబడ్డ ఇళ్లు, అపార్ట్మెంట్లను డ్రోన్ల ద్వారా చిత్రీకరిస్తున్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 13, 2026
తూ.గో జిల్లాలో నిరంతరాయంగా LPG సరఫరా

ఏపీ ప్రభుత్వం గృహ అవసరాలు & అత్యవసర సేవలకు నిరంతరాయంగా LPG సరఫరా జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన IOCL, HPCL, BPCL సంస్థలతో పాటు LPG పంపిణీదారులతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నదనీ జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఉన్న 52 ఎల్పీజీ గ్యాస్ పంపిణీదారుల ద్వారా సుమారు 8.67 లక్షల గ్యాస్, కనెక్షన్ దారులకు గ్యాస్ సరఫరా జరుగుతోందన్నారు.
News March 13, 2026
రాజమండ్రి: రేపు ‘జాతీయ లోక్ అదాలత్’

మార్చి 14న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. కాకినాడ, కోనసీమ, రాజమండ్రి, రంపచోడవరం పరిధిలోని కక్షిదారులు తమ పెండింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు. కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ, ఖర్చు తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


