News April 4, 2024

సుప్రీంకోర్టులో ‘లిక్కర్ ఫైట్’.. తండ్రి తీర్పును తిరగరాస్తారా?

image

సుప్రీంకోర్టులో CJI చంద్రచూడ్ ఆధ్వర్యంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఇండస్ట్రియల్ ఆల్కహాల్ రెవెన్యూపై విచారిస్తున్న వేళ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మాసనం సభ్యురాలైన జస్టిస్ బీవీ నాగరత్న తండ్రి, నాటి CJI బీవీ వెంకటరామయ్య ఇదే కేసుపై 1989లో తీర్పు ఇచ్చారు. రెవెన్యూపై కేంద్రానికి అనుకూలంగా ఆ తీర్పు ఉంది. మరి తండ్రి తీర్పును జస్టిస్ నాగరత్న తిరగరాస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Similar News

News April 22, 2025

లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్: VSR

image

AP: లిక్కర్ స్కామ్‌లో తాను ఒక్క రూపాయీ ముట్టలేదని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్(సమాచారాన్ని బహిర్గతం చేసే వ్యక్తి). దొరికిన దొంగలు, దొరకని దొంగలు తప్పించుకునేందుకే నా పేరును లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను’ అని తెలిపారు.

News April 22, 2025

హిందీ ఇంపోజిషన్‌: ఫడణవీస్ వ్యాఖ్యలపై స్టాలిన్ సెటైర్లు

image

హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ ఇంపోజిషన్‌పై తీవ్ర వ్యతిరేకతను చూసి మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ భయపడ్డారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఎద్దేవా చేశారు. అందుకే మహారాష్ట్రలో కేవలం మరాఠీ తప్పనిసరంటున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయనకు అధికారికంగా చెప్పిందా అని ప్రశ్నించారు. అదే నిజమైతే మూడో భాషా బోధన తప్పనిసరి కాదంటూ అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.

News April 22, 2025

ఒక్కరోజే రూ.2,750 పెరిగిన తులం బంగారం

image

బంగారం ధరలు సరికొత్త మైలురాయి చేరాయి. హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24క్యారెట్ల పసిడి ₹1649 పెరిగి ₹1,00,000కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి కూడా 10గ్రాములకు ₹2,750 పెరిగి తొలిసారి ₹92,900కు చేరింది. అటు KG వెండి ₹1,11,000గా ఉంది. విజయవాడ, విశాఖ సహా రెండు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో బంగారంపై పెట్టుబడికి డిమాండ్, స్థానిక వివాహాల సీజన్ ఈ ధరల ధగధగకు ప్రధాన కారణాలు.

error: Content is protected !!