News September 13, 2025

అన్నమయ్య: టాప్ గ్రేడ్ బొప్పాయి ధర KG రూ.8

image

సెప్టెంబర్ 13వ తారీఖున టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. సెకండ్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.7గా నిర్ణయించారు. అన్నమయ్య జిల్లాలో ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు కొంటె వారిపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమ్ (9573990331, 9030315951)ను సంప్రదించవచ్చని రైతులకు సూచించారు.

Similar News

News March 15, 2026

సంగారెడ్డి: ఎస్సీ కార్పొరేషన్ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక పథకాలకు ఈనెల 17 నుంచి 24 వరకు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు పత్రాలను ప్రింట్ తీసుకుని సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు స్థానిక అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

News March 15, 2026

ప్రయాణికులకు శుభవార్త.. ప్రతి 45 నిమిషాలకో ఏసీ బస్సు

image

వేసవి దృష్ట్యా ఖమ్మం నుంచి హైదరాబాద్‌, మియాపూర్‌కు ప్రతి 45 నిమిషాలకో ఏసీ రాజధాని నాన్‌స్టాప్‌ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ శివప్రసాద్‌ తెలిపారు. కొత్త బస్టాండ్‌ నుంచి సూపర్‌ లగ్జరీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ముందస్తు రిజర్వేషన్ల కోసం tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

News March 15, 2026

పర్షియన్ గల్ఫ్‌లో భారత యుద్ధ నౌకలు!

image

భారత నేవీకి చెందిన పలు యుద్ధ నౌకలను ఇరాన్‌కు సమీపంలోని పర్షియన్ గల్ఫ్‌లో మోహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియా వైపు వచ్చే వాణిజ్య నౌకలకు అవసరమైతే సాయం అందించేందుకు అవి అక్కడ సిద్ధంగా ఉన్నాయని చెప్పాయి. మరోవైపు LPG గ్యాస్‌తో వస్తున్న రెండు భారత షిప్‌లు హార్ముజ్ జలసంధి దాటేందుకు ఇరాన్ అధికారులు అనుమతి ఇచ్చారు. అందులోని శివాలిక్ ట్యాంకర్ ఈనెల 21న దేశానికి చేరుకోనుంది.