News September 13, 2025

ADB: హ్యాట్సాప్.. ఆ నలుగురు టీమ్

image

జీవితంలో ఎవరికైనా సహాయం చేయాలంటే డబ్బు మాత్రమే కాదని మంచి మనసు కూడా కావాలని 10 మందితో కూడిన ‘ఆ నలుగురు’ టీమ్ నిరూపిస్తోంది. గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో గత 5 సంవత్సరాలుగా గ్రామంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియలకు 10 మంది కలిసి రూ.5,500 స్వతహాగా అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆఖరి మజిలిలో అందరికీ అండగా నిలుస్తున్న వారి తీరుపై అంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News March 16, 2026

సిద్ధవటం: ప్రారంభమైన పది పరీక్షలు

image

మండల కేంద్రమైన సిద్ధవటం జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి పరీక్షల సందర్భంగా సిద్ధవటం మండల ఎస్సై హారిక ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు చెక్ చేసి లోపలికి అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏఎస్ఐ సుబ్బరామచంద్ర, కొండయ్య, కానిస్టేబుల్ రాఘవ బందోబస్తులో పాల్గొన్నారు.

News March 16, 2026

టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

image

ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల లోపే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యమైన స్టూడెంట్స్‌ను ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటలవరకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది.

News March 16, 2026

సిగరెట్, మద్యంతో మతిమరుపు!

image

వయసుతో సంబంధం లేకుండా కొన్ని అలవాట్లు మెదడు పరిమాణాన్ని తగ్గిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘నిద్రలేమి, ఒత్తిడి, ఊబకాయం, మధుమేహం, వ్యాయామం లేకపోవడం వల్ల మెదడు వేగంగా కుంచించుకుపోతుంది. విటమిన్ B12 లోపం, ఒంటరితనం, ధూమపానం, మద్యపానం వల్ల కూడా పరిమాణం తగ్గి మతిమరుపు వచ్చే ప్రమాదం ఉంది. సరైన నిద్ర, పౌష్టికాహారం, రోజూ వ్యాయామం చేసి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు’ అని సూచిస్తున్నారు.