News September 13, 2025

నేడు గద్వాలలో పర్యటించనున్న కేటీఆర్

image

కేటీఆర్ నేడు గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా గద్వాల నియోజకవర్గ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. రాయచూరు రోడ్డు నుంచి పాత బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పాత బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.

Similar News

News March 12, 2026

కొండమల్లేపల్లిలో 60 సిలిండర్లు సీజ్

image

కొండమల్లేపల్లిలో పౌర సరఫరాల శాఖ అధికారులు హోటల్, రెస్టారెంట్, దాబాలపై గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమంగా వినియోగిస్తున్న 60 సిలిండర్లను సీజ్ చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ముబీన్, దీపక్, సైదులు, ముక్తర్, జ్యోతి, కుమార్ పాల్గొన్నారు.

News March 12, 2026

జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదు: జేసీ

image

జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, గృహ అవసరాలకు గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ కొరత వార్తలు అవాస్తవమన్నారు. గ్యాస్ బుకింగ్‌కు 25 రోజుల గడువు మాత్రమే ఉంటుందని, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.

News March 12, 2026

GWL: పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163.. ఎస్పీ శ్రీనివాసరావు

image

ఈనెల13 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమి గూడాటాన్ని నిషేధించామన్నారు. ప్రతిరోజు ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 3:00 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలన్నారు.