News September 13, 2025
కృష్ణ: కర్ణాటక బస్సును ఢీకొని వ్యక్తి మృతి

కర్ణాటక బస్సును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన శుక్రవారం కృష్ణ మండలంలో కృష్ణ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. కృష్ణ ఎస్సై నవీద్ తెలిపిన వివరాల ప్రకారం.. శక్తినగర్ గ్రామానికి చెందిన సుగర్ రెడ్డి(40) టై రోడ్డు నుంచి శక్తినగర్కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కర్ణాటక బస్ను ఢీకొన్నాడు. ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోయాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో చనిపోయాడు.
Similar News
News September 13, 2025
నెల్లూరు: ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి మైథిలి కళ్లు దానం

స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురైన మైథిలి ప్రియా కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. ప్రస్తుతం మైథిలి మృతదేహం నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంది. గత రాత్రి మైథిలిని ఆమె స్నేహితుడు నిఖిల్ దారుణంగా హత్య చేశాడు. మృతురాలు బి ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది.
News September 13, 2025
సిరిసిల్ల: సన్నాలకు బోనస్ అందేదెప్పుడు..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు సన్నం వడ్లను సాగు చేశారు. కాగా, వీరంతా రూ.500 బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగిలో సుమారు 10 వేల క్వింటాళ్లకు పైగా సన్నాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ఇప్పటివరకు బోనస్ పడలేదు. బోనస్ వస్తే పంట పెట్టుబడికి సాయంగా ఉంటుందని రైతన్నలు అంటున్నారు. ప్రభుత్వ స్పందించి ఖాతాల్లో బోనస్ వేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.
News September 13, 2025
విజయవాడలో రాష్ట్రస్థాయి ఘట్కా పోటీలు ప్రారంభం

కృష్ణా జిల్లా ఘట్కా అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో రాష్ట్రస్థాయి ఘట్కా పోటీలు ప్రారంభమయ్యాయి. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరైపోటీలను ప్రారంభించారు. ఘట్కా క్రీడను అభ్యసించడం వల్ల నిజ జీవితంలో ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పోటీలకు హాజరైన క్రీడా కారులను ఉద్దేశించి మాట్లాడినట్లు ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు తెలిపారు.