News September 13, 2025

వేధింపుల వల్లే హసీనా మృతి: తండ్రి ఫిర్యాదు

image

పెద్దకడబూరు మండలం మేకడోనలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హసీనా కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి మృతి చెందింది. హసీనాకు ముగ్గురు సంతానం. ఆమె మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. తమ కూతురి మరణానికి అల్లుడే కారణమని హసీనా తండ్రి మోహినుద్దీన్ సాబ్ పెద్దకడబూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాదాపు 3 ఏళ్లుగా తన కూతురుని వేధించేవాడని పేర్కొన్నారు.

Similar News

News March 25, 2026

SRH vs RCB.. తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్‌తో IPL 2026 ప్రారంభం కానుంది. ఈ నెల 28న బెంగళూరులో జరిగే ఈ పోరుకు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. పగలు 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనా.. సాయంత్రం మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం 60 శాతం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, ఈదురుగాలుల వల్ల ఆటకు అంతరాయం కలగొచ్చని చెప్పింది. దీంతో మ్యాచ్ ఆలస్యం అయ్యేందుకు ఆస్కారముంది.

News March 25, 2026

జీవీఎంసీలో పెరగనున్న కార్పొరేషన్ వార్డుల సంఖ్య

image

ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా వార్డుల సంఖ్య సవరణకు నిర్ణయం తీసుకుంది. 15 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో గరిష్ఠంగా 120 వార్డులు ఉండేలా మార్పులు చేసింది. ప్రస్తుతం జీవీఎంసీలో 98 వార్డులు ఉండగా, జనాభా దాదాపు 24 లక్షలకుపైగా చేరింది. దీంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, జీవీఎంసీలో విలీనం చేయాల్సిన గ్రామాల అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

News March 25, 2026

మచిలీపట్నం RTA ఆఫీస్‌పై ఏసీబీ దాడులు

image

మచిలీపట్నంలో రవాణా శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లలో అక్రమాలపై అధికారులు రికార్డులు, కంప్యూటర్లు, పత్రాలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.