News September 13, 2025
ఉలవపాడు: జ్యువెలరీ షాప్ సిబ్బందిని బురిడి కొట్టించిన కిలా(లే)డీలు

ఉలవపాడులోని ఓ జ్యువెలరీ షాప్లో శుక్రవారం 4 జతల బంగారు కమ్మలు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. బంగారు కమ్మలు కొనడానికి వచ్చినట్లు నటించిన ఇద్దరు మహిళలు షాపు సిబ్బందిని బురిడి కొట్టించి 4 జతల గోల్డ్ కమ్మలు మాయం చేశారు. ఆ తర్వాత గుర్తించిన షాపు సిబ్బంది రూ.లక్ష విలువైన సొత్తు చోరీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI అంకమ్మ తెలిపారు.
Similar News
News September 13, 2025
నెల్లూరు: ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి మైథిలి కళ్లు దానం

స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురైన మైథిలి ప్రియా కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. ప్రస్తుతం మైథిలి మృతదేహం నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంది. గత రాత్రి మైథిలిని ఆమె స్నేహితుడు నిఖిల్ దారుణంగా హత్య చేశాడు. మృతురాలు బి ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది.
News September 13, 2025
ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విషజ్వరాలు

ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు కలకలం సృష్ఠించాయి. పలువురు విద్యార్థినులు విషజ్వరాల బారిన పడినట్లు సమాచారం. శుక్రవారం స్కూల్లో అధికారులు మెడికల్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు చికిత్స అందించారు. ఆత్మకూరు గురుకుల పాఠశాల విద్యార్థినులకు విషజ్వరాలు రావడంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. స్కూల్ వద్దకు వెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News September 13, 2025
నెల్లూరు: ఆ బార్లకు రీ నోటిఫికేషన్

జిల్లాలో నిర్వహించకుండా ఓపెన్ కేటగిరిలో ఉన్న 32 బార్లకు, గీత కులాల రిజర్వుడు కింద ఉన్న 1 బార్ కి సంబంధించి రీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా నిషేధ, ఎక్సైజ్ శాఖాధికారి తెలిపారు. ఈ నెల 17న దరఖాస్తుల స్వీకరణ, 18 న లాటరీ, ఎంపిక ప్రక్రియలను చేపట్టానున్నట్లు వివరించారు. అభ్యర్థులు ఈ మార్పు చేసిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు చేయాలని కోరారు