News September 13, 2025

4 రోజుల్లో 27,650 టన్నుల యూరియా: తుమ్మల

image

రైతులకు ఎరువుల కొరత లేకుండా చూస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27,650 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంటుందని ఆయన శుక్రవారం వెల్లడించారు. ఇప్పటికే శుక్రవారం 11,930 టన్నులు, ఇప్పటి వరకు మొత్తం 23,000 టన్నుల యూరియా సరఫరా అయ్యిందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 13, 2025

VKB: రాజీమార్గంతో మేలు: జడ్జి

image

రాజీమార్గమే రాజ మార్గమని, రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకుంటే కక్షలు తగ్గిపోయి సమయం వృథా కాకుండా ఆర్థికంగా చితికి పోకుండా మేలు జరుగుతుందని జిల్లా జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించారు. జడ్జి మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కరించుకొని కక్షిదారులు న్యాయం పొందాలని తెలిపారు.

News September 13, 2025

‘నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా.. నగరాజ ధరుడా శ్రీనారాయణా’ అంటే అర్థమేంటి?

image

అన్నమయ్య రచించిన ఓ ప్రముఖ కీర్తనలోని ఈ పంక్తులకు.. ‘వేదాలు(నిగమ), ఉపనిషత్తుల(నిగమాంత) ద్వారా వర్ణించబడిన అత్యంత మనోహరమైన రూపాన్ని కలిగి ఉన్నవాడా, ఓ శ్రీ నారాయణా! నీవు గొప్ప పర్వతాలు మోసినవాడవు(నగరాజ ధరుడా!)’ అనే అర్థం వస్తుంది. శ్రీమహావిష్ణువు కృష్ణుడి అవతారంలో గోవర్ధన గిరిని, క్షీరసాగర మథన సమయంలో కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోశాడు. అలా నగరాజ ధరుడిగా ఆయణ్ను కొలుస్తారు.

News September 13, 2025

3ప్రాంతాల్లో ఓట్ల కోసం నాటకమాడారు: నారాయణ

image

AP: జగన్‌కు రాజధానిపై స్పష్టత లేదని మంత్రి నారాయణ విమర్శించారు. ‘రాజధానికి 30వేల ఎకరాలు కావాలని ఆయనే అసెంబ్లీలో చెప్పారు. ఆ తర్వాత 3రాజధానులు అంటే 3ప్రాంతాల్లో ఓట్లు వేస్తారని నాటకమాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే ప్రజలు ఆ 11సీట్లు కూడా ఇవ్వరు. <<17688305>>సజ్జల<<>> ఆ పార్టీలో సీనియర్ నేత. ఆయన చెబితే YCP చెప్పినట్లే కదా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని అన్నారు.