News September 13, 2025
ఫేక్ ప్రచారాలకు త్వరలోనే చెక్: మంత్రి అనిత

AP: సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల నియంత్రణకు త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. దీనిపై సీఎం CBN కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందని చెప్పారు. కొందరు విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని, ఎక్కడ దాక్కున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం రాబోతోందని చెప్పారు. SMలో మహిళలపై వ్యక్తిత్వ హననం ఎక్కువవుతోందని వాపోయారు.
Similar News
News February 13, 2026
పూత, పిందె దశలో మామిడి పంటకు నీరు ఎలా ఇవ్వాలి?

మామిడి తోటలోని చెట్లు అన్నింటికీ పూ మొగ్గలు వచ్చినప్పుడు తోటకు తేలికగా నీరు పెట్టాలి. పిందెలు ఏర్పడ్డాక మామిడి చెట్లకు వీలును బట్టి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 తడుల నీటిని అందించాలి. దీని వల్ల పిందెలు రాలడం తగ్గి కాయలు పెద్దవిగా నాణ్యంగా పెరుగుతాయి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో అవసరానికి మించి చెట్లకు నీరు పెట్టడం వల్ల పిందెలు అధికంగా రాలిపోయే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News February 13, 2026
350 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 13, 2026
శివుడు లింగాకారంలో ఎందుకు?

శివుడు లింగాకారంలో పూజలందుకుంటాడు. అందుకు పురాణాలు 2 కారణాలు చెబుతున్నాయి. వరాహ పురాణం ప్రకారం.. భృగు మహర్షి శాపం వల్ల శివుడు విగ్రహ రూపం వదిలి లింగాకారంలో పూజలందుకుంటున్నాడు. అయితే తాత్విక కోణంలో ‘లింగం’ అంటే ఓ ‘గుర్తు’ లేదా ‘సంకేతం’. నిరాకారుడు, అనంతమైన శూన్య స్వరూపుడైన పరమాత్మను ఆరాధించడానికి శివలింగం ఓ పవిత్ర చిహ్నం. అందుకే రూపం లేని ఆ పరమేశ్వరుడిని భక్తులు లింగరూపంలో కొలుస్తారు.


