News September 13, 2025

గోవాడ చెరుకు రైతులకు ‘తీపి’ కబురు లేనట్లేనా?

image

చోడవరం(M) గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఈ ఏడాది చెరుకు క్రషింగ్ చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ సీజన్‌లో క్రషింగ్ సాధ్యం కాదని ఉన్నతాధికారులు తెల్చి చెప్పినట్లు సమాచారం. పొరుగు జిల్లాల్లోని కర్మాగారాలకు చెరుకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఫ్యాక్టరీ మనుగడపై రైతులు, కార్మికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Similar News

News March 17, 2026

ఏలూరు: రైలు ఢీకొని ఇద్దరు మృతి

image

ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలో రైలు ఢీకొని ఆదివారం ఇరువురు మృతి చెందారు. వట్లూరు – నూజివీడు మధ్య పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నలుపు రంగు జీన్స్, టీ-షర్టు ధరించి ఉన్నాడు. బొమ్మలూరు సమీపంలో మరో ఘటనలో బిహార్‌కు చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

News March 17, 2026

యుద్ధ ప్రభావం: నంద్యాల జిల్లాలో కుప్పకూలిన ధరలు

image

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు నంద్యాల జిల్లా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో ఉత్పత్తుల ధరలు భారీగా పడిపోయాయి. క్వింటాల్ పసుపు రూ.13 వేల నుంచి రూ.9 వేలకు, మొక్కజొన్న రూ.2500 నుంచి రూ.1400కు తగ్గింది. అరటి, నిమ్మ ధరలు సైతం సగానికి పడిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

News March 17, 2026

డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. DCP యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. గత శనివారం TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్, ఢిల్లీ వ్యాపారి నమిత్ సహా మరికొందరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో మహేశ్‌కు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్ రెడ్డి, రితేశ్, నమిత్‌కు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.