News September 13, 2025
ములుగు: కనుమరుగవుతున్న బతుకమ్మ పాటలు!

బతుకమ్మ పండుగకు ఓరుగల్లు పెట్టింది పేరు. ప్రతి గ్రామంలో ఘనంగా జరుపుకునే సంబురం. 9 రోజులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఒక్కచోట చేరి జరుపుకునే పండుగ. కానీ, కొన్నేళ్లుగా బతుకమ్మ పాటలు, సంస్కృతి కనుమరుగవుతోంది. డీజేలు, వల్గర్ పాటలతో పండుగ అర్దాన్ని మారుస్తున్నారు. వింత పోకడలు, అర్థం పర్థం లేని పాటలు, విచిత్ర డాన్సులతో పూల పండుగ భవిష్యత్తు తరాలకు తెలియకుండా పోతుంది. కాగా, ఈనెల 22న ఎంగిలి పూల బతుకమ్మ.
Similar News
News September 13, 2025
దసరా: దుర్గగుడిలో ప్రోటోకాల్ టికెట్లు రద్దు?

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గగుడిలో ప్రోటోకాల్ కింద ఇచ్చే బ్రేక్ దర్శనం టికెట్లను ఈసారి రద్దు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. గతేడాది ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టర్ వంటి ప్రముఖులకు రోజుకు 100 ఉచిత టికెట్లు కేటాయించారు. దీనివల్ల సాధారణ భక్తులకు దర్శనం ఆలస్యం కావడమే కాకుండా, ఆలయానికి ఆదాయం కూడా తగ్గుతోందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
News September 13, 2025
రూ.1.91 కోట్లు పలికిన ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ టెండర్

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ నిర్వహణను బాక్స్ టెండర్లో రూ.1.91,44,000లకు శివకుమార్ దక్కించుకున్నాడు. శుక్రవారం ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిబిషన్ టెండర్లను కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ఓపెన్, బాక్స్ టెండర్లను నిర్వహించారు. ఓపెన్ టెండర్లో సాకే పెద్దిరాజు రూ.1.76 కోట్లకు, బాక్స్ టెండర్లో శివకుమార్ రూ.1.91 కోట్లకు బిడ్ వేశారు.
News September 13, 2025
విజయవాడ దుర్గగుడిలో రూ.500 టికెట్ల రద్దు?

దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.500 అంతరాలయ దర్శనం టిక్కెట్లను రద్దు చేసే యోచనలో ఆలయ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. గత దసరా ఉత్సవాలలో ఈ టికెట్లు తీసుకున్న భక్తులను ప్రధాన ద్వారం నుంచే దర్శనం చేయించి పంపించారు. గతేడాది ఈ టికెట్ల ద్వారా ఆలయానికి రూ.2.30 కోట్ల ఆదాయం లభించింది. ఈసారి కేవలం రూ. 300 టికెట్లను మాత్రమే విక్రయిస్తారని సమాచారం.