News September 13, 2025
HYD: Ed.CET రిజల్ట్ కోసం ఎదురుచూపులు

Ed.CET 2025 సెకండ్ ఫేజ్ రిజల్ట్ సెప్టెంబర్ 12న ప్రకటిస్తామని అధికారులు తెలియజేసినప్పటికీ ఫలితాలు విడుదల చేయలేదు. దీంతో పరీక్ష రాసి, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చిన అభ్యర్థులు రిజల్ట్ కోసం వేచి చూస్తున్నారు. దీనిపై HYD తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను వివరణ కోరగా, టెక్నికల్ సమస్య కారణంగా ఆలస్యం జరిగిందని, త్వరలోనే రిజల్ట్ ప్రకటిస్తామన్నారు.
Similar News
News March 14, 2026
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి సవిత

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రి సవితను శనివారం కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. మంత్రి వినతులు స్వీకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.
News March 14, 2026
సూళ్లూరుపేట: కళ్లలో కారం కొట్టి బంగారం దోపిడీ

సూళ్లూరుపేట కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోల్డ్ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు నగలను అపహరించుకొని పరారయ్యాడు. ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 14, 2026
NRPT: జిల్లాలో సిలిండర్ల కొరత లేదు: అదనపు కలెక్టర్

జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, గృహావసరాలకు విద్యాలయాలకు, ఆసుపత్రులకు సిలిండర్ల సరఫరాలో లోటు రానివ్వమని అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్లో గ్యాస్ డీలర్లు సెల్స్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. సిలిండర్ల సరఫరాకు సంబంధించిన వివరాలను ప్రతి రోజు అందించాలని చెప్పారు. యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలను నమ్మకండని సూచించారు.


