News September 13, 2025

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి

image

తూర్పు గోదావరి జిల్లా మెజిస్ట్రేట్ & కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ఆమెకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Similar News

News March 9, 2026

12న రాజమండ్రిలో స్పెషల్ డ్రైవ్

image

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఈ నెల 12వ తేదీన రాజమండ్రిలో ‘జన్ సున్వాయి’ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారి టి.శ్రీదేవి సోమవారం తెలిపారు. జిల్లా యంత్రాంగం, లీగల్ సెల్, పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. గృహహింస, ఇతర అన్యాయాలకు గురయ్యే మహిళలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. బాధితులకు తక్షణ న్యాయం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆమె వెల్లడించారు.

News March 9, 2026

కలెక్టరేట్‌లో యథాతథంగా ‘పీజీఆర్‌ఎస్‌’: కలెక్టర్

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లను యథాతథంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.in ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకోవచ్చని, వివరాల కోసం 1100 నంబరును సంప్రదించాలని సూచించారు. అధికారులు విధిగా హాజరై అర్జీలను స్వీకరించాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News March 8, 2026

తూ.గో: రోడ్డు ప్రమాదంలో మహిళ స్పాట్‌డెడ్

image

చాగల్లు ప్రధాన కూడలిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలయ్యారు. కుమారదేవానికి చెందిన పంది వీర్రాజు, నాగలక్ష్మి(52) దంపతులు శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎదురుగా వచ్చిన లారీ వారి మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.