News September 13, 2025

NLG: రజాకార్ల మారణకాండకు 79 ఏళ్లు

image

రజాకారులు సృష్టించిన మారణ హోమానికి సజీవ సాక్ష్యం వల్లాల గ్రామం. 1948 ఆగస్టు15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత శాలిగౌరారం మండలం వల్లాల ప్రభుత్వ పాఠశాలలో పది మంది విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తుండగా గ్రామంపై దండెత్తిన రజాకారులు అమానుష హత్యాకాండకు తెగబడ్డారు. పాఠశాల ప్రాంగణంలోనే పది మందిని తుపాకీతో కాల్చి చంపిన ఘటనకు 79 ఏళ్లు నిండాయి.

Similar News

News March 22, 2026

భద్రాద్రి ట్రస్టు బోర్డుపై వీడని సందిగ్ధత!

image

భద్రాద్రి రామాలయ ట్రస్టు బోర్డు ఏర్పాటు దశాబ్ద కాలంగా వాయిదా పడుతూనే ఉంది. ఏటా రూ. 50కోట్లకు పైగా ఆదాయం వచ్చే ఈ ఆలయానికి బోర్డు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబరులో నోటిఫికేషన్ ఇచ్చినా, ఆశావహులు భారీగా ఉండటంతో ప్రక్రియ నిలిచిపోయింది. 27న శ్రీరామనవమికి CM రేవంత్ రానున్న నేపథ్యంలో, ఈసారైనా ట్రస్టు బోర్డుపై స్పష్టత వస్తుందని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

News March 22, 2026

జనగామ: ఎంపిక చేసిన అంగన్వాడీలకు నిధుల కేటాయింపు!

image

అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. గతేడాది పోషణ వాటిక కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన అంగన్వాడీలకు అందులో కనీస సౌకర్యాలు, కల్పించాల్సిన సౌకర్యాల కోసం ఒక్కో కేంద్రానికి రూ.25 వేల మంజూరు చేసింది. జిల్లాలో ఎంపికైన 227 అంగన్వాడీ కేంద్రాలకు రూ.56 లక్షలు మంజూరయ్యాయి. వీటితో చిన్నారులకు మ్యాట్లు, క్రీడా సామగ్రి, ఇతర పరికరాల కొనుగోలుకు వినియోగించనున్నారు.

News March 22, 2026

కొండచిలువల రక్తంలో బరువును తగ్గించే మాలిక్యూల్

image

బర్మీస్ కొండచిలువలు తమ శరీర బరువుకు సమానమైన ఆహారాన్ని తినగలవు. ఆ తర్వాత నెలలపాటు తిండి లేకుండా ఉండగలవు. ఇలాంటి అసాధారణ జీవక్రియకు వాటి రక్తంలోని pTOS మాలిక్యూల్ కారణమని స్టాన్‌ఫోర్డ్(US) సైంటిస్టులు గుర్తించారు. దీన్ని వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లలో వాడొచ్చని, ఊబకాయంపై పోరాటంలో ఇదొక కీలక మలుపు అని పేర్కొన్నారు. pTOSను ఎలుకలకు ఇవ్వగా అవి తక్కువ ఆహారం తిని 28 రోజుల్లోనే 9% బరువు తగ్గాయన్నారు.