News September 13, 2025

1GB ప్లాన్ ఎత్తేయడంపై వివరణ కోరిన TRAI

image

సరసమైన 1GB ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ ఉపసంహరణకు గల కారణాలను తెలపాలని JIO, AIRTEL సంస్థలను TRAI కోరింది. రూ.249 ప్లాన్ ఎత్తేయడంతో వినియోగదారులపై మరింత భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్‌లైన్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉందని JIO తెలుపగా.. వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగా రూ.249 ప్లాన్‌ను తీసేసినట్లు AIRTEL పేర్కొంది. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ ప్లాన్ ₹299 నుంచి మొదలుకానుంది.

Similar News

News March 22, 2026

ఘోరం.. తల్లి ముందే మైనర్ బాలికను..

image

నాసిక్ (MH) జ్యోతిషుడు <<19434630>>అశోక్ ఖరత్<<>> మైనర్లనూ వదల్లేదు. తల్లి ముందరే ఓ పాపను అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ప్రతికూల శక్తిని తొలగిస్తానంటూ టీషర్ట్‌ను పైకి ఎత్తమని కడుపు, ఛాతీని ఇంటర్నెట్ కేబుల్ టెస్టర్‌తో రుద్దాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియోను NCP (శరద్ పవార్ వర్గం) నేత రూపాలి రిలీజ్ చేశారు. కాగా అశోక్ పెన్ డ్రైవ్‌లో 100కు పైగా వీడియోలను పోలీసులు గుర్తించారు.

News March 22, 2026

24 ఏళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు: అమిత్ షా

image

అత్యధిక రోజులు సేవలు అందించిన ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ <<19447588>>రికార్డ్<<>> నెలకొల్పిన నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. 24ఏళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదని.. ఇది ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. ఇందుకే ప్రజలు ఆయనను మూడు సార్లు గుజరాత్ సీఎం, మూడు సార్లు భారత ప్రధానిని చేశారని తెలిపారు. మోదీ హయాంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

News March 22, 2026

వరి వద్దు ఈ పంటలు వేయండి: సీఎం

image

TG: కష్టం తక్కువగా ఉంటుందని రైతులు వరి పండిస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలకు మన దేశంలో పండించిన వడ్లు, బియ్యం సరఫరా చేసినా ఇంకా నిల్వలు మిగిలే ఉంటున్నాయి. ఈసారి 50 లక్షల టన్నుల కంటే ఎక్కువ వరి కొనబోమని కేంద్రం చెప్పింది. ఇప్పటికే 70 లక్షల టన్నులు కొన్నాం. మిగతా వరి ఏం చేయాలి? అందుకే రైతులు మిల్లెట్లు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించాలి’ అని సిద్దిపేటలో సూచించారు.