News September 13, 2025

తలసరి ఆదాయంలో అట్టడుగున ములుగు జిల్లా..!

image

అడవుల జిల్లా ములుగు తలసరి ఆదాయంలో రాష్ట్రంలో అట్టడుగున ఉంది. 2023-24 నివేదిక ప్రకారం రూ.1,97,639తో 25వ స్థానంలో కొనసాగుతోంది. జిల్లా ప్రజలు 90% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగం పెరిగింది. ఉన్న ఒక్క బిల్ట్ ఫ్యాక్టరీ దశాబ్ధం క్రితం మూతపడింది. ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం వృద్ధిలోకి వస్తోంది. పామాయిల్ ఫ్యాక్టరీకి ఇటీవల పునాదులు పడ్డాయి.

Similar News

News September 13, 2025

రెండో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ ఎస్తర్?

image

హీరోయిన్ ఎస్తర్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెల్ల రంగు గౌను ధరించి ఆమె SMలో ఓ పోస్ట్ చేశారు. ‘జీవితంలో మరో అందమైన సంవత్సరాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఈ పుట్టినరోజున నాపై ప్రేమ, ఆశీర్వాదాలు కురిపిస్తున్న మీ అందరికీ స్పెషల్ థాంక్స్. త్వరలోనే ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేస్తా’ అంటూ రాసుకొచ్చారు. కాగా సింగర్ నోయల్, ఎస్తర్ 2019లో లవ్ మ్యారేజ్ చేసుకుని, 6 నెలల్లోపే విడిపోయారు.

News September 13, 2025

ఏలూరు జిల్లా మీదుగా నూతన నేషనల్ హైవే: ఎంపీ

image

ఖమ్మం – కొవ్వూరు జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకాతిరుమల – ఏలూరు – కైకలూరు – కత్తిపూడి మీదుగా నూతన జాతీయ రహదారిని ప్రతిపాదిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ వెల్లడించారు. శనివారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త రహదారి కోసం త్వరలో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపుతామని ఎంపీ చెప్పారు.

News September 13, 2025

HYD: నిర్లక్ష్య రైడింగ్ ప్రాణాన్ని బలిగొంది..!

image

ఘట్‌కేసర్ పరిధి అన్నోజిగూడలో నిర్లక్ష్య రైడింగ్ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. విధులకెళ్తున్న 57 ఏళ్ల ఎలక్ట్రీషియన్ చంద్రారెడ్డిని ఓ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా బైక్‌‌ నడిపి, ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. బైక్ నడిపిన 16 ఏళ్ల బాలుడితోపాటు, వాహన యజమాని అయిన అతడి తల్లిపై కేసు నమోదు చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే పేరెంట్స్‌పై కేసులు నమోదు చేస్తామన్నారు.