News September 13, 2025

కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ కలకలం

image

చేబ్రోలు (M) కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ లక్షణాలు ఒకరిలో బయటపడటంతో మండలంలో కలకలం రేపుతుంది. ఇప్పటికే జ్వరాలు ఉన్నవారికి రక్త పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి నెగిటివ్ వచ్చిందని మిగిలిన నలుగురికి కొకొయ్ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ కొత్తరెడ్డిపాలెంపై దృష్టి పెట్టింది.

Similar News

News September 13, 2025

రెండో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ ఎస్తర్?

image

హీరోయిన్ ఎస్తర్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెల్ల రంగు గౌను ధరించి ఆమె SMలో ఓ పోస్ట్ చేశారు. ‘జీవితంలో మరో అందమైన సంవత్సరాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఈ పుట్టినరోజున నాపై ప్రేమ, ఆశీర్వాదాలు కురిపిస్తున్న మీ అందరికీ స్పెషల్ థాంక్స్. త్వరలోనే ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేస్తా’ అంటూ రాసుకొచ్చారు. కాగా సింగర్ నోయల్, ఎస్తర్ 2019లో లవ్ మ్యారేజ్ చేసుకుని, 6 నెలల్లోపే విడిపోయారు.

News September 13, 2025

ఏలూరు జిల్లా మీదుగా నూతన నేషనల్ హైవే: ఎంపీ

image

ఖమ్మం – కొవ్వూరు జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకాతిరుమల – ఏలూరు – కైకలూరు – కత్తిపూడి మీదుగా నూతన జాతీయ రహదారిని ప్రతిపాదిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ వెల్లడించారు. శనివారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త రహదారి కోసం త్వరలో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపుతామని ఎంపీ చెప్పారు.

News September 13, 2025

HYD: నిర్లక్ష్య రైడింగ్ ప్రాణాన్ని బలిగొంది..!

image

ఘట్‌కేసర్ పరిధి అన్నోజిగూడలో నిర్లక్ష్య రైడింగ్ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. విధులకెళ్తున్న 57 ఏళ్ల ఎలక్ట్రీషియన్ చంద్రారెడ్డిని ఓ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా బైక్‌‌ నడిపి, ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. బైక్ నడిపిన 16 ఏళ్ల బాలుడితోపాటు, వాహన యజమాని అయిన అతడి తల్లిపై కేసు నమోదు చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే పేరెంట్స్‌పై కేసులు నమోదు చేస్తామన్నారు.