News September 13, 2025
అనకాపల్లి: కుప్పలుగా పడి ఉన్న చనిపోయిన కోళ్లు

అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చనిపోయిన బాయిలర్ కోళ్లు దర్శనమిస్తున్నాయి. దేవరాపల్లి మండలం మారేపల్లి శివారు చేనులపాలెం వద్ద రైవాడ కాలువతోపాటు చెరువుల్లో శనివారం చనిపోయిక కోళ్లు కనిపించాయి. పరిసర ప్రాంతాల్లో పౌల్ట్రీ యజమానులు చనిపోయిన వందలాది కోళ్ళను రాత్రి సమయంలో కాలువల్లో వేసి వెళ్లిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.
Similar News
News September 13, 2025
అశ్వారావుపేట: వాగులో ఇద్దరు మహిళలు గల్లంతు

అశ్వారావుపేట మండలం కావడి గుండ్ల వాగులో ఈరోజు కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారు. స్థానికుల వివరాల ప్రకారం.. పత్తి చేనులో పనికి వెళ్లిన చెన్నమ్మ(50), వరలక్ష్మి (55) వాగు దాటే క్రమంలో గల్లంతయ్యారు.వారు ఏపీకి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. పనికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో గల్లంతయ్యారని తెలిపారు. వరద ఉద్ధృతిలో చిక్కుకున్న వారిలో నలుగురు ఒడ్డుకు చేరుకోగా ఇద్దరు గల్లంతయ్యారు.
News September 13, 2025
HYD: మరీ ఇంత బరితెగింపా..? రేవంత్ రెడ్డి..!: RSP

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గురుకులంలో విషాహారం తిని 20 మంది అమ్మాయిలు అనారోగ్యానికి గురయ్యారు. ట్రీట్మెంట్ చేయించకుండా మీరే నయం చేసుకోండని చేతులు దులుపుకోవడం ఏంటని BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంత బరితెగింపా అని ఫైర్ అయ్యారు. ఈ అమ్మాయి ప్రస్తుతం జహీరాబాద్లో తన ఇంట్లో చికిత్స పొందుతోందని ఆయన Xలో ట్వీట్ చేశారు.
News September 13, 2025
HYD: మరీ ఇంత బరితెగింపా..? రేవంత్ రెడ్డి..!: RSP

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గురుకులంలో విషాహారం తిని 20 మంది అమ్మాయిలు అనారోగ్యానికి గురయ్యారు. ట్రీట్మెంట్ చేయించకుండా మీరే నయం చేసుకోండని చేతులు దులుపుకోవడం ఏంటని BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంత బరితెగింపా అని ఫైర్ అయ్యారు. ఈ అమ్మాయి ప్రస్తుతం జహీరాబాద్లో తన ఇంట్లో చికిత్స పొందుతోందని ఆయన Xలో ట్వీట్ చేశారు.