News September 13, 2025

ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విషజ్వరాలు

image

ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు కలకలం సృష్ఠించాయి. పలువురు విద్యార్థినులు విషజ్వరాల బారిన పడినట్లు సమాచారం. శుక్రవారం స్కూల్లో అధికారులు మెడికల్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు చికిత్స అందించారు. ఆత్మకూరు గురుకుల పాఠశాల విద్యార్థినులకు విషజ్వరాలు రావడంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. స్కూల్‌ వద్దకు వెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News March 11, 2026

నెల్లూరులో భారీగా మొబైల్ ఫోన్లు సీజ్

image

నెల్లూరులోని పలు మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ దుకాణాలపై అధికారులు దాడులు చేశారు. సరైన బిల్లులు, GST చెల్లించకుండా విక్రయిస్తున్న రూ.49.24 లక్షల విలువైన మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలను సీజ్ చేశారు. ఈ సరుకును వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించారు. జై అంబికా, శ్రీ అంబికా, జేపీ మొబైల్స్ షాపుల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ నరసింహారావు, DCTO విష్ణు రావు దాడులు చేశారు.

News March 11, 2026

నెల్లూరు: meesho- ఉమెన్స్ డే గిఫ్ట్ పేరుతో లింకు వైరల్

image

సామాజిక మాధ్యమాల్లో meesho ప్రశ్నావళి అని, ప్రశ్నలకు సమాధానం చెబితే లక్ష వరకు గిఫ్ట్ గెలుచుకోవచ్చని ఓ లింకు వైరల్‌గా మారింది. ఈ లింకును క్లిక్ చేస్తే.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వస్తుంది. ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆఫర్ 12వ తేదీ వరకు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఇలాంటి లింకులను నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News March 11, 2026

మత్స్య పరిశోధన కేంద్రాల స్థాపన కోసం నిధులు ఏర్పాటుపై ఎంపీ ఆరా

image

ఏపీలో అదనపు మత్స్య పరిశోధన కేంద్రాలను స్థాపించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గత మూడేళ్లలో కేటాయించిన నిధులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరా తీశారు. లోక్‌సభలో మంగళవారం ఈ అంశంపై వివరాలు కోరారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో నాలుగు ప్రాంతీయ మత్స్య పరిశోధన కేంద్రాలు ఉన్నాయన్నారు.