News September 13, 2025
‘సిగాచీ’పై నివేదిక రెడీ.. ఇక సర్కారు నిర్ణయమే తరువాయి

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ కు విచారణ నివేదికను అందజేశారు. ప్రమాదానికి కారణాలతోపాటు ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు కూలంకుషంగా నివేదికలో పొందుపరిచారు.
Similar News
News March 22, 2026
KMR: రాష్ట్రంలో 198 ఉద్యోగాలు.. రేపే హాల్టికెట్లు

TGSRTCలో 198 సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు హాల్టికెట్లను సోమవారం ఉ.8 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. https://www.tgprb.in/లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఉద్యోగాలకు దాదాపు 26 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ నెల 29న 10AM-1PM వరకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు, 2.30PM-5.30PM వరకు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
News March 22, 2026
ఈ IPL సీజన్ గిల్కు మంచి అవకాశం: పుజారా

IPL-2026లో శుభ్మన్ గిల్ చెలరేగి ఆడితే భారత T20 జట్టులో తిరిగి స్థానం పొందే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ పుజారా అభిప్రాయపడ్డారు. ‘గిల్ క్వాలిటీ ప్లేయర్. T20 WC జట్టులో చోటు దక్కకపోవడం అతడిలో కసిని పెంచి ఉంటుంది. ఈ IPL సీజన్ మంచి అవకాశం. 150-160SRతో బ్యాటింగ్ చేయగలనని నిరూపించుకోవాలి. ఈ టైమ్లో అతడిపై ఒత్తిడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. IPLలో గుజరాత్ టైటాన్స్కు గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు.
News March 22, 2026
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.190, మాంసం 300 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.310 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


