News September 13, 2025
అభివృద్ధి ఓ వైపు.. ఉద్యమం మరో వైపు..!

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతరకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.150 కోట్లను కేటాయించగా వందరోజుల యాక్షన్ ప్లాన్తో పనులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పంటనష్ట పరిహారం వివాదం తెరపైకి వచ్చింది. జాతర సమయంలో పంట నష్ట పోతున్న రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ రైతాంగ పోరాటాన్ని BRS వెనకుండి నడిపిస్తున్నట్లు సమాచారం.
Similar News
News September 13, 2025
కర్నూలు: ‘ప్రజల వద్దకే తపాల సేవలు’

తపాల శాఖలో నూతన టెక్నాలజీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐయంఏ 2.O ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజల ముంగిటే తపాల సేవలను అందివ్వడం జరుగుతుందని కర్నూలు జిల్లా పోస్టల్ ఎస్పీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం తుంగభద్ర ఉప తపాల కార్యాలయంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బీపీఎంలు, ఎబీపీఎంలతో సమావేశం నిర్వహించారు. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్తో తపాల బీమా, ఐపీపీబీ ద్వారా ఖాతాలు తెరవడం జరిగిందని తెలిపారు.
News September 13, 2025
HYD: ట్రాఫిక్ అలర్ట్.. రేపు ఈ రోడ్లు బంద్..!(2/2)

HYDలోని మిర్ ఆలం మండి, ఏతెబార్ చౌక్, అలీజాహ్ కోట్లా, బీబీ బజార్, వోల్టా హోటల్, అఫ్జల్ గంజ్ టీ జంక్షన్, ఉస్మాన్ గంజ్, ఎమ్.జే.మార్కెట్ జంక్షన్, తాజ్ ఐలాండ్, నంపల్లి టీ జంక్షన్, హాజ్ హౌస్, ఏ.ఆర్.పెట్రోల్ పంప్, నాంపల్లి జంక్షన్ మార్గాల్లో రేపు ట్రాఫిక్ డైవర్షన్ అమలు కానుంది. వాహనాల రాకపోకలు నిలిపివేత కొనసాగుతుందని పోలీసులు ప్రకటించారు.
News September 13, 2025
చైనాపై 50%-100% టారిఫ్స్ వేయండి: NATOకు ట్రంప్ లేఖ

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు చైనాపై 50%-100% టారిఫ్స్ విధించాలని <<7824953>>NATO<<>>కు ట్రంప్ లేఖ రాశారు. ‘NATO దేశాలు రష్యా ఆయిల్ కొనడం ఆశ్చర్యంగా ఉంది. అదే మిమ్మల్ని బలహీనం చేస్తోంది. దీనికి సరేనంటేనే నేను ముందుకెళ్తాను. బలమైన టారిఫ్స్తోనే చైనా, రష్యా బంధం బ్రేక్ అవుతుంది. అప్పుడే యుద్ధం ఆగుతుంది. లేదంటే US టైమ్, ఎనర్జీ, మనీ వృథా అవుతాయి’ అని స్పష్టం చేశారు. లేఖలో భారత ప్రస్తావన లేకపోవడం గమనార్హం.