News September 13, 2025
మంథని: ప్రజాసేవలో RTC కొత్త అడుగు..!

TSRTC వినూత్న సేవాకార్యక్రమం “యాత్రాదానం”ను ప్రారంభించినట్లు మంథని డిపో మేనేజర్ శ్రావణ్కుమార్ తెలిపారు. దాతలు ఇచ్చే విరాళాలతో అనాథలు, నిరుపేద విద్యార్థులు, దివ్యాంగులు, నిరాశ్రయ వృద్ధులు దేవాలయాలు, పర్యాటక కేంద్రాలు సందర్శించే అవకాశం పొందుతారు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు వంటి ప్రత్యేక దినాల్లో ఈ యాత్ర ద్వారా ఆనందాన్ని పంచుకోవచ్చు. బుకింగ్స్కు 9959225923, 9948671514ను లేదా డిపోలో సంప్రదించవచ్చు.
Similar News
News March 27, 2026
ఖమ్మం: వరి కోతకు వచ్చి గుండెపోటుతో డ్రైవర్ మృతి

నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. వరి కోత మిషన్తో పనుల కోసం వచ్చిన ఓ డ్రైవర్, స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పనుల కోసం వచ్చి అనంత లోకాలకు వెళ్లడంతో తోటి కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు.
News March 27, 2026
‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
<<7337592828>>Click on Whatsapp <<>>
News March 27, 2026
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక పూర్తి

ఏలూరు ఆశ్రమం మెడికల్ కళాశాల మైదానంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్ 19, అండర్ 23 బాలుర క్రికెట్ జట్ల ఎంపిక జరిగింది. ఎంపిక పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అండర్ 23 జట్టులో 23 మంది సభ్యులు, అండర్ 19 జట్టులో 16 మంది సభ్యులను సెలెక్టర్లు ఎంపిక చేశారు. వీరు త్వరలో మూలపాడులో జరగబోయే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని సెలెక్టర్ శ్రీనివాసరాజు వెల్లడించారు.


