News September 13, 2025

ములుగు: నెమలిలా నృత్యం.. తల్లిదండ్రుల కళ్లలో ఆనందం!

image

శాస్త్రీయ నృత్యంపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్యరీతులు తమ పిల్లలకు నేర్పించేందుకు పేరెంట్స్ ముందుకు వస్తున్నారు. చిన్నారులు స్టేజిపై నెమలిలా నృత్యం చేస్తుంటే మురిసిపోతున్నారు. ఇటీవల రోజుల్లో ములుగు ప్రాంతంలో క్లాసికల్ డాన్స్‌కు క్రేజ్ పెరిగింది. పలువురు గురువులు వారాంతాల్లో స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. పోటీల్లో టాలెంట్ చూపి బాలలు ప్రైజ్‌లు గెల్చుకుంటున్నారు.

Similar News

News September 13, 2025

సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి: CM

image

AP: రాజకీయ ముసుగులో జరిగే నేరాలను ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్పీలతో సమావేశమైన ఆయన.. టెక్నాలజీ సాయంతో దర్యాప్తులో అత్యుత్తమ ఫలితాలు రాబట్టవచ్చని తెలిపారు. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించాలన్నారు. సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలని ఆదేశించారు. వైఎస్ వివేకానంద హత్య, సింగయ్య మృతిని కేసు స్టడీలుగా చూడాలని సూచించారు.

News September 13, 2025

NGKL: లోక్ అదాలత్‌లో 23,967 కేసుల పరిష్కారం

image

నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. సివిల్, బ్యాంకు, విద్యుత్, అధికారులు పెట్టిన కేసులు రాజీ మార్గంలో పరిష్కరించారు. మొత్తం 23,967 కేసులు పరిష్కారం అయ్యాయి. రూ.61,89,914 వసూలయ్యాయి. కార్యక్రమంలో న్యాయమూర్తులు, అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. న్యాయమూర్తులు వెంకట్రావు, శ్రుతి దూత, శ్రీనిధి, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

News September 13, 2025

15న యథాతథిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సెప్టెంబర్ 15న సోమవారం యథాతథిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా meekosam.ap.gov.in తెలియజేయాలని కోరారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రం పీజీఆర్ఎస్‌లో అందజేయాలన్నారు.