News September 13, 2025
అలంపూర్లో భక్తుల రద్దీ

అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం మహా నివేదన సమయంలో భక్తులు దర్శనాల కోసం వేచి చూశారు. అనంతరం హారతులు అందుకున్నారు.
Similar News
News March 14, 2026
ఒక్కరోజే 2,37,123 గ్యాస్ సిలిండర్ల పంపిణీ

TG: డొమెస్టిక్ సిలిండర్ల డెలివరీకి సమస్య రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 2,37,123 గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయ్యాయి. సాధారణంగా జరిగే రోజువారీ సగటు పంపిణీ కంటే ఇది 12K సిలిండర్లు అధికం కావడం విశేషం. IOCL 83,166, HPCL 88,257, BPCL 65,700 గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశాయి. GOVT కఠిన చర్యల ఫలితంగా బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్టపడింది.
News March 14, 2026
ఖమ్మం ఎంపీకి అంతర్జాతీయ గౌరవం

ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్–స్విట్జర్లాండ్ ‘పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్’ సభ్యుడిగా ఆయనను లోక్సభ స్పీకర్ నామినేట్ చేశారు. 18వ లోక్సభ కాలానికి గానూ రెండు దేశాల మధ్య పార్లమెంటరీ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ గ్రూపును ఏర్పాటు చేసినట్లు లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది. ఈ నియామకంపై జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 14, 2026
త్వరలోనే BC రక్షణ చట్టం అమలు: మంత్రి సవిత

దేశంలోనే తొలిసారిగా APలో బీసీ రక్షణ చట్టం అమలు చేయబోతున్నట్లు మంత్రి ఎస్.సవిత అన్నారు. శనివారం సవిత నేతృత్వంలో జరిగిన బీసీ రక్షణ చట్టం భేటీలో మంత్రుల బృందం, అధికారులు పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. బీసీలను అన్ని రంగాల్లో ముందు నిలపాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.


