News September 13, 2025

దసరా: దుర్గగుడిలో ప్రోటోకాల్‌ టికెట్లు రద్దు?

image

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గగుడిలో ప్రోటోకాల్ కింద ఇచ్చే బ్రేక్ దర్శనం టికెట్లను ఈసారి రద్దు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. గతేడాది ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టర్‌ వంటి ప్రముఖులకు రోజుకు 100 ఉచిత టికెట్లు కేటాయించారు. దీనివల్ల సాధారణ భక్తులకు దర్శనం ఆలస్యం కావడమే కాకుండా, ఆలయానికి ఆదాయం కూడా తగ్గుతోందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Similar News

News September 13, 2025

బాపట్ల జిల్లా నూతన SP ఇతనే.!

image

బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా ఉమామహేశ్వర్ నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న తుషార్ డూడీని బదిలీ చేసి ఆయన స్థానంలో ఉమామహేశ్వర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఎస్పీ తుషార్ చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఇప్పటికే జిల్లాకు నూతన కలెక్టర్ రాగా నేడు ప్రకటించిన ఎస్పీల బదిలీల్లో భాగంగా నూతన ఎస్పీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

News September 13, 2025

NRPT: లోక్ అదాలత్‌లో 5,581 కేసుల పరిష్కారం

image

నారాయణపేట, కోస్గి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 5,581 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా జరిమానాల రూపంలో ప్రభుత్వానికి రూ.22,17,956 ఆదాయం సమకూరిందని చెప్పారు. లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన పోలీస్, ఎక్సైజ్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.

News September 13, 2025

ఇక విరిగిన ఎముకలు 3 నిమిషాల్లో ఫిక్స్!

image

విరిగిన ఎముకలను నయం చేసేందుకు చైనీస్ రీసెర్చర్స్ కొత్త పద్ధతిని కనుగొన్నారు. 3 నిమిషాల్లోనే అతుక్కునేలా చేసే ‘బోన్ 02’ అనే జిగురును జేజియాంగ్ ప్రావిన్స్‌లోని సర్ రన్ రన్ షా ఆస్పత్రి చీఫ్ సర్జన్ లిన్ బృందం ఆవిష్కరించింది. నీటిలో బ్రిడ్జిలకు ఆల్చిప్పలు బలంగా అతుక్కోవడాన్ని పరిశీలించి దీన్ని డెవలప్ చేశామంది. 150 మంది పేషెంట్లపై టెస్ట్ చేయగా సంప్రదాయ పద్ధతుల కంటే మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది.